ETV Bharat / city

ట్రంప్​ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి

author img

By

Published : Nov 8, 2020, 6:09 PM IST

డొనాల్డ్ ట్రంప్​ను తలుచుకోగానే రాష్ట్రంలో మనకు గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ట్రంప్​, జగన్మోహన్ రెడ్డికి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ట్రంప్​ను తలచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి
ట్రంప్​ను తలచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రపంచంలో ట్రంప్, జగన్మోహన్​రెడ్డి ఇద్దరు మాత్రమే మాస్క్​లు లేకుండా తిరిగారని తెదేపా నేత పట్టాభి అన్నారు. ట్రంప్ తన దేశంలో ఎందుకు లాక్ డౌన్ విధించాలి అంటే? జగన్ ఇక్కడ పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్​తో వైరస్ తగ్గుతుందన్నారని గుర్తు చేశారు. ఇద్దరూ ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ట్రంప్ పాలనలో అమెరికాలో జాత్యాహంకార దాడులు ఎక్కువయ్యాయన్న పట్టాభి... జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని దుయ్యబట్టారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రపంచంలో ట్రంప్, జగన్మోహన్​రెడ్డి ఇద్దరు మాత్రమే మాస్క్​లు లేకుండా తిరిగారని తెదేపా నేత పట్టాభి అన్నారు. ట్రంప్ తన దేశంలో ఎందుకు లాక్ డౌన్ విధించాలి అంటే? జగన్ ఇక్కడ పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్​తో వైరస్ తగ్గుతుందన్నారని గుర్తు చేశారు. ఇద్దరూ ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ట్రంప్ పాలనలో అమెరికాలో జాత్యాహంకార దాడులు ఎక్కువయ్యాయన్న పట్టాభి... జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: 'మొండిగా ఆరోపించడమా.. హుందాగా వైదొలగడమా?'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.