తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా... వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... తాజాగా పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు... మొత్తం 8 స్థానాలకు కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్-యాదగౌడ్, పెద్దపల్లి-సంజయ్, మహబూబ్నగర్-కొండపల్లి రాంచందర్రావు, నల్గొండ-నెల్లూరు దుర్గాప్రసాద్, మెదక్-ఇల్లందు రమేశ్, జహీరాబాద్-పైడి గోపాల్ రెడ్డి, మల్కాజిగిరి-కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కరీంనగర్-జోజిరెడ్డిని పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు.
పవిత్ర దుస్తుల్లో ఉండి అలా మాట్లాడాతారా..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి... బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. తెలంగాణలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తోందని మండిపడ్డారు.