ETV Bharat / city

రాష్ట్ర మాజీ మంత్రి పిటిషన్​పై సుప్రీంలో విచారణ - సాగు చట్టాలపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజా వార్తలు

నూతన వ్యవసాయ చట్టాల రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ.. రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహా మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

vadde
రాష్ట్ర మాజీ మంత్రి పిటిషన్​పై సుప్రీంలో విచారణ.. కేంద్రానికి నోటీసులు
author img

By

Published : Mar 10, 2021, 9:00 PM IST

Updated : Mar 10, 2021, 9:43 PM IST

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన మరో మూడు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహా మరో ఇద్దరు సాగు చట్టాల రాజ్యంగబద్ధతను సవాలు చేశారు. వీరి పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్​లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో వీటిని జత చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు. దీంతో ప్రతివాదైన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త సాగు చట్టాలపై జనవరి 12న స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. అభ్యంతరాలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ నుంచి భూపిందర్ సింగ్ తప్పుకున్నారు.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన మరో మూడు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహా మరో ఇద్దరు సాగు చట్టాల రాజ్యంగబద్ధతను సవాలు చేశారు. వీరి పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్​లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో వీటిని జత చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు. దీంతో ప్రతివాదైన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త సాగు చట్టాలపై జనవరి 12న స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. అభ్యంతరాలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ నుంచి భూపిందర్ సింగ్ తప్పుకున్నారు.

ఇదీ చదవండి: డబ్బులివ్వలేదని ఓటింగ్​కు దూరంగా గిరిజన కుటుంబాలు

Last Updated : Mar 10, 2021, 9:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.