ETV Bharat / city

Rape on minor: మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

author img

By

Published : Oct 16, 2021, 7:52 PM IST

మతిస్థిమితంలేని మైనర్ బాలికపై ఓ కామంధుడు కన్నేసి అత్యాచారం (Minor Girl Rape) చేశాడు. డబ్బు ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

డబ్బు ఆశ చూపి మతిస్థిమితం సరిగ్గా లేని మైనర్ బాలికపై అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాల్కల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 46 ఏళ్ల దస్తగిరి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మతిస్థిమితం లేని బాలికతో దస్తగిరి ఇంట్లో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు... బాధితురాలి కుటుంబీకులకు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని హద్నూర్ పోలీసులు వైద్య పరీక్షల కోసం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యాచార (Minor Girl Rape) ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజేంద్రనగర్​లో..

ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను ఆపలేకపోతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేశారు. మద్యం మత్తులో ఉన్న తనను ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు.. తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​ : మహిళపై సామూహిక అత్యాచారం.. ఆటోలో తీసుకెళ్లి దారుణం

డబ్బు ఆశ చూపి మతిస్థిమితం సరిగ్గా లేని మైనర్ బాలికపై అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాల్కల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 46 ఏళ్ల దస్తగిరి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మతిస్థిమితం లేని బాలికతో దస్తగిరి ఇంట్లో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు... బాధితురాలి కుటుంబీకులకు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని హద్నూర్ పోలీసులు వైద్య పరీక్షల కోసం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యాచార (Minor Girl Rape) ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజేంద్రనగర్​లో..

ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను ఆపలేకపోతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేశారు. మద్యం మత్తులో ఉన్న తనను ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు.. తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​ : మహిళపై సామూహిక అత్యాచారం.. ఆటోలో తీసుకెళ్లి దారుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.