ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై విచారణకు సహకరిస్తాం: రమేష్ ఆసుపత్రి

author img

By

Published : Sep 22, 2020, 4:29 PM IST

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అగ్ని ప్రమాదానికి స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం నిర్ణక్ష్యమే కారణమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక,.. పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలు నిర్ధరిస్తున్నాయని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై పోలీసుల విచారణకు సహకరిస్తామని డా.రమేష్ బాబు స్పష్టం చేశారు. కొవిడ్ దృష్ట్యా ఆన్​లైన్ విచారణకు హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

రమేష్ ఆసుపత్రి
రమేష్ ఆసుపత్రి

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద కేసు విచారణకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రమేష్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టరు డా. రమేష్‌బాబు తరపున రమేష్‌ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి తనను మళ్లీ హాజరుకావాలని సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని... ప్రస్తుతం ఉన్నటువంటి కొవిడ్‌-19 తీవ్ర పరిస్థితులలో, సుప్రీంకోర్టు.. కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయొద్దని పోలీసులు వారికి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను దృశ్య, శ్రవణ విధానంలో విచారించమని డా. రమేష్‌బాబు ఆ ప్రకటనలో కోరారు.

హోటల్​ యాజమాన్యానిదే బాధ్యత

స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమనే విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత విజయవాడ పోలీసులు హైకోర్టులో సీఆర్​ఎల్​పీ 3444/2020లో దాఖలు చేసిన యాక్షన్‌ సబ్‌ సీక్వెంట్‌ రిపోర్టు నిర్ధరిస్తున్నాయన్నారు. హోటల్‌ నిర్వహణకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే... హోటల్‌, ఆసుపత్రి యాజమాన్యాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. అప్పటికే పెయిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌ను ప్రభుత్వ అనుమతితో స్వర్ణ ప్యాలెస్​లో నిర్వహిస్తున్నారన్నారు.

కొన్ని గదులు మాత్రమే ఆసుపత్రికి కేటాయింపు

హోటల్‌ ఆక్యుపెన్సీ, ఫైర్‌ ఎన్​ఓసీ తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా.. హోటల్‌ యాజమాన్యానిదేనని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కొవిడ్‌ రోగుల వైద్య చికిత్స కోసం కొన్ని రూములు మాత్రమే రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించారన్నారు. లీజు ప్రసక్తే ఈ ఒప్పందంలో రాలేదని, రోగులకు కేటాయించిన రూములకు అద్దె నేరుగా హోటల్‌ యాజమాన్యమే వసూలు చేసుకుని రశీదులు ఇచ్చిందన్నారు. 2020 సెప్టెంబరు 15న... 11 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళితో సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద నోటీసును చీఫ్‌ కార్డియాలజిస్టు డా. రమేష్‌బాబుకు ఇవ్వగా... 2020 సెప్టెంబరు 17న అన్ని అంశాలకు సంబంధించి డా. రమేష్‌బాబు సమాధానం ఇచ్చారని యాజమాన్యం తెలిపింది.

అన్ని వివరాలు అందిస్తాం

హోటల్‌ నిర్వహణకు సంబంధించి రెండు యాజమాన్యాల ఒప్పందం మేరకు జరిగిన ఆడియో టేపులు, హోటల్‌ యాజమాన్యానికి... ఆసుపత్రి పేషెంట్‌ కేర్‌ టీమ్స్‌కు జరిగిన వాట్సప్‌ సందేశాలను విచారణ అధికారి ఏసీపీకి అందజేశామని రమేష్‌ ఆసుపత్రి పేర్కొంది. ఈ సందేశాలలో జులై 23 నుంచి అగ్నిప్రమాద దుర్ఘటన జరిగే వరకు ప్రతిరోజు హోటల్‌ నిర్వహణలో హోటల్‌ మేనేజరు, మేనేజింగ్‌ డైరెక్టరు శ్రీనివాస్‌బాబు, ఆసుపత్రికి సంబంధించి పేషెంట్‌ మెడికల్‌ కేర్‌ అందించే సిబ్బంది సందేశాలను యథాతథంగా సమర్పించినట్లు తెలిపారు.

రమేష్ ఆసుపత్రి పత్రికా ప్రకటన
రమేష్ ఆసుపత్రి పత్రికా ప్రకటన

ఇదీ చదవండి : కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద కేసు విచారణకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రమేష్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టరు డా. రమేష్‌బాబు తరపున రమేష్‌ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి తనను మళ్లీ హాజరుకావాలని సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని... ప్రస్తుతం ఉన్నటువంటి కొవిడ్‌-19 తీవ్ర పరిస్థితులలో, సుప్రీంకోర్టు.. కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయొద్దని పోలీసులు వారికి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను దృశ్య, శ్రవణ విధానంలో విచారించమని డా. రమేష్‌బాబు ఆ ప్రకటనలో కోరారు.

హోటల్​ యాజమాన్యానిదే బాధ్యత

స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమనే విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత విజయవాడ పోలీసులు హైకోర్టులో సీఆర్​ఎల్​పీ 3444/2020లో దాఖలు చేసిన యాక్షన్‌ సబ్‌ సీక్వెంట్‌ రిపోర్టు నిర్ధరిస్తున్నాయన్నారు. హోటల్‌ నిర్వహణకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే... హోటల్‌, ఆసుపత్రి యాజమాన్యాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. అప్పటికే పెయిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌ను ప్రభుత్వ అనుమతితో స్వర్ణ ప్యాలెస్​లో నిర్వహిస్తున్నారన్నారు.

కొన్ని గదులు మాత్రమే ఆసుపత్రికి కేటాయింపు

హోటల్‌ ఆక్యుపెన్సీ, ఫైర్‌ ఎన్​ఓసీ తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా.. హోటల్‌ యాజమాన్యానిదేనని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కొవిడ్‌ రోగుల వైద్య చికిత్స కోసం కొన్ని రూములు మాత్రమే రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించారన్నారు. లీజు ప్రసక్తే ఈ ఒప్పందంలో రాలేదని, రోగులకు కేటాయించిన రూములకు అద్దె నేరుగా హోటల్‌ యాజమాన్యమే వసూలు చేసుకుని రశీదులు ఇచ్చిందన్నారు. 2020 సెప్టెంబరు 15న... 11 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళితో సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద నోటీసును చీఫ్‌ కార్డియాలజిస్టు డా. రమేష్‌బాబుకు ఇవ్వగా... 2020 సెప్టెంబరు 17న అన్ని అంశాలకు సంబంధించి డా. రమేష్‌బాబు సమాధానం ఇచ్చారని యాజమాన్యం తెలిపింది.

అన్ని వివరాలు అందిస్తాం

హోటల్‌ నిర్వహణకు సంబంధించి రెండు యాజమాన్యాల ఒప్పందం మేరకు జరిగిన ఆడియో టేపులు, హోటల్‌ యాజమాన్యానికి... ఆసుపత్రి పేషెంట్‌ కేర్‌ టీమ్స్‌కు జరిగిన వాట్సప్‌ సందేశాలను విచారణ అధికారి ఏసీపీకి అందజేశామని రమేష్‌ ఆసుపత్రి పేర్కొంది. ఈ సందేశాలలో జులై 23 నుంచి అగ్నిప్రమాద దుర్ఘటన జరిగే వరకు ప్రతిరోజు హోటల్‌ నిర్వహణలో హోటల్‌ మేనేజరు, మేనేజింగ్‌ డైరెక్టరు శ్రీనివాస్‌బాబు, ఆసుపత్రికి సంబంధించి పేషెంట్‌ మెడికల్‌ కేర్‌ అందించే సిబ్బంది సందేశాలను యథాతథంగా సమర్పించినట్లు తెలిపారు.

రమేష్ ఆసుపత్రి పత్రికా ప్రకటన
రమేష్ ఆసుపత్రి పత్రికా ప్రకటన

ఇదీ చదవండి : కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.