విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో 8 నెలల గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవ్వరూ స్పందించక పోవటం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించారని.., ఆ దృశ్యాలు తనను ఎంతో కలచి వేశాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గర్భిణీ వాంతులు చేసుకుని చనిపోయిందని, ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదంటూ... తోటి రోగులు బాధపడుతూ ఈ వీడియో పెట్టారన్నారు. ఈ దృశ్యాలు ఎంతో భయంకరంగా, దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.