ETV Bharat / city

వైద్య విద్య ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల

author img

By

Published : Nov 13, 2020, 11:06 PM IST

రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో ఏర్పడిన సందిగ్ధం తొలగిపోయింది. 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియో, యునానీ డిగ్రీ కోర్సులు, తిరుపతి పద్మావతి వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. రిజర్వేషన్‌ కేటగిరీ సీట్లకు సంబంధించిన 550జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ జీవో 159ని విడుదల చేసింది. జీవోను ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Ntr university
Ntr university

వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు జారీ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ప్రవేశాల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు చేస్తే.. చివరి వరకు అన్ని విడతల కౌన్సెలింగ్‌కు అదే సరిపోతుందని తెలిపారు.

ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలుత ఆల్‌ ఇండియా కోటా కింద ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో 15శాతం సీట్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా 85శాతం, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా(ఎ కేటగిరి) కింద ఉండే 50శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 13వ తేదీ నుంచి 21 తేదీ సాయంత్రం 4గంటల్లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అంగవైకల్య పరీక్షలకు సంబంధించి విశ్వవిద్యాలయం నియమించిన ప్రత్యేక మెడికల్‌ బోర్డు ముందు ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, నిర్వహణ రుసుంగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3540, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు రూ.2950 ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు .

అభ్యర్థులు నీట్‌ యూజీ ర్యాంకు కార్డు, పుట్టిన తేదీ పత్రం, విద్యార్హతలు, 6వ తరగతి నుంచి పది వరకు స్టడీ సర్టిఫికేట్‌ , బదిలీ సర్టిఫికేట్, కుల, మైనార్టీ ధ్రువీకరణ పత్రం, ఆదాయ పత్రం, అంగవైక్యల ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీసు అమరవీరుల సంతతి, ఆంగ్లో ఇండియన్‌ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నివాస ధ్రువీకరణ, ఆధార్‌ కార్డు, లోకల్‌ ప్రాధాన్యతకు సంబంధించి ఎమ్ఆర్‌వో ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటోలు, అభ్యర్థి సంతకం అప్‌లోడ్‌ చేయాలి. సాంకేతిక సమస్యలు ఎదురైతే 9490332169, 08978780501 నెంబర్ల కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపునకు హైకోర్టు సూచనలు

వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు జారీ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ప్రవేశాల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు చేస్తే.. చివరి వరకు అన్ని విడతల కౌన్సెలింగ్‌కు అదే సరిపోతుందని తెలిపారు.

ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలుత ఆల్‌ ఇండియా కోటా కింద ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో 15శాతం సీట్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా 85శాతం, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా(ఎ కేటగిరి) కింద ఉండే 50శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 13వ తేదీ నుంచి 21 తేదీ సాయంత్రం 4గంటల్లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అంగవైకల్య పరీక్షలకు సంబంధించి విశ్వవిద్యాలయం నియమించిన ప్రత్యేక మెడికల్‌ బోర్డు ముందు ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, నిర్వహణ రుసుంగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3540, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు రూ.2950 ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు .

అభ్యర్థులు నీట్‌ యూజీ ర్యాంకు కార్డు, పుట్టిన తేదీ పత్రం, విద్యార్హతలు, 6వ తరగతి నుంచి పది వరకు స్టడీ సర్టిఫికేట్‌ , బదిలీ సర్టిఫికేట్, కుల, మైనార్టీ ధ్రువీకరణ పత్రం, ఆదాయ పత్రం, అంగవైక్యల ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీసు అమరవీరుల సంతతి, ఆంగ్లో ఇండియన్‌ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నివాస ధ్రువీకరణ, ఆధార్‌ కార్డు, లోకల్‌ ప్రాధాన్యతకు సంబంధించి ఎమ్ఆర్‌వో ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటోలు, అభ్యర్థి సంతకం అప్‌లోడ్‌ చేయాలి. సాంకేతిక సమస్యలు ఎదురైతే 9490332169, 08978780501 నెంబర్ల కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపునకు హైకోర్టు సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.