విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నాన్-కొవిడ్ సేవల ప్రారంభంతో రోగుల రద్దీ గణనీయంగా పెరిగింది. కొత్తగా నిర్మించిన సూపర్స్పెషాలిటీ బ్లాక్తో కలిపి ఆస్పత్రిలో 840 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సగం కొవిడ్ చికిత్స కోసం కేటాయించారు. సూపర్స్పెషాలిటీ బ్లాక్ మొత్తాన్ని కొవిడ్ సేవలకు వినియోగిస్తున్నారు. సాధారణ వ్యాధులు, అత్యవసర కేసుల పెరుగుదలతో కొవిడ్ పడకల్ని తగ్గిస్తూ.. ఇతర చికిత్సలకు పెంచుతున్నారు. ఏ బ్లాక్లో బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యం అందిస్తుండగా... బీ, సీ బ్లాకుల్లో పడకల్ని అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు అవసరమైన సాధారణ రోగులకు కేటాయిస్తున్నారు.
జిల్లాలో రోజూ 300 వరకు కేసులు
ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డులో ప్రస్తుతం 200 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు ఆక్సిజన్ సమస్యతో ఉండగా.. మరికొందరికి ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో నిత్యం 200 నుంచి మూడొందల వరకూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 30 నుంచి 40 మంది తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చేవారి సంఖ్యా ఎక్కువే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 170 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతుండగా... నిత్యం 5 నుంచి 6 కేసులు మాత్రమే వస్తున్నాయన్నారు.
నిత్యం వందల మంది వస్తున్నారు..
ప్రస్తుతం సాధారణ వార్డుకు నిత్యం రెండు నుంచి మూడొందల మంది ఓపీ కోసం వస్తున్నారు. వీరిలో అత్యవసర వైద్యం అవసరమైనవారిని ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వంద మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో కొవిడ్, బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నందువల్ల అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రమాద కేసులు మినహా మిగతావారిని ఓపీ చూసి మందులు ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు.
ఇదీ చదవండి:
Recruitment: వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్లో.. సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు