ETV Bharat / city

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరంపై ఫిర్యాదు! - కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ తాజా వార్తలు

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్​తో​ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరంపై ఫిర్యాదు!
కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరంపై ఫిర్యాదు!
author img

By

Published : Jun 9, 2021, 11:39 AM IST

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగతున్నాయని ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్‌ను కోరారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయింపు చేస్తున్నారన్న రఘురామ.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. గత నెల 14న ఏపీ సీఐడీ పోలీసుల ప్రవర్తన తీరుపైనా వివరాలను గజేంద్రసింగ్​కు తెలిపినట్లు సమాచారం. పోలవరం, తనతో పోలీసుల ప్రవర్తన వంటి వివరాలతో.. రెండు వేర్వేరు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగతున్నాయని ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్‌ను కోరారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయింపు చేస్తున్నారన్న రఘురామ.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. గత నెల 14న ఏపీ సీఐడీ పోలీసుల ప్రవర్తన తీరుపైనా వివరాలను గజేంద్రసింగ్​కు తెలిపినట్లు సమాచారం. పోలవరం, తనతో పోలీసుల ప్రవర్తన వంటి వివరాలతో.. రెండు వేర్వేరు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

Krishna River: సోమశిల వద్ద.. కృష్ణా నదిపై కొత్త వంతెనకు ప్రణాళికలు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.