ETV Bharat / city

'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'

author img

By

Published : Sep 2, 2020, 3:14 PM IST

న్యాయమూర్తులు, కోర్టులు అడ్డురాకుంటే తమ ఇష్టానుసారం ప్రవర్తించవచ్చని పాలకులు భావిస్తున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకి 3 మానభంగాలు, నెలకు 95 ఆకృత్యాలు జరుగుతున్నాయన్నారు.

'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'
'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'

లక్షా 30 వేల కోట్ల ఆస్తులు తెలంగాణ నుంచి మనకు రావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​లో ఆమోదించే ప్రతి బిల్లుని గుడ్డిగా వైకాపా ఎంపీలు సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని పాలకులను ప్రశ్నించకపోతే, భవిష్యత్​లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ దురాగతాలు, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్నారనే పాలకులు తెదేపాపై కక్ష కట్టారన్నారు. అసెంబ్లీలో మేధావులున్నారని భావిస్తున్న ప్రభుత్వం, అందులోని సభ్యులకన్నా ఎక్కువగా ఎందుకు సలహాదారులను నియమించుకుందని నిలదీశారు.

లక్షా 30 వేల కోట్ల ఆస్తులు తెలంగాణ నుంచి మనకు రావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​లో ఆమోదించే ప్రతి బిల్లుని గుడ్డిగా వైకాపా ఎంపీలు సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని పాలకులను ప్రశ్నించకపోతే, భవిష్యత్​లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ దురాగతాలు, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్నారనే పాలకులు తెదేపాపై కక్ష కట్టారన్నారు. అసెంబ్లీలో మేధావులున్నారని భావిస్తున్న ప్రభుత్వం, అందులోని సభ్యులకన్నా ఎక్కువగా ఎందుకు సలహాదారులను నియమించుకుందని నిలదీశారు.

ఇదీ చదవండి: వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.