ETV Bharat / city

ధూపదీప నైవేద్యాల కోసం బడ్జెట్​లో కేటాయింపులు: శ్రీనివాసరావు - వెల్లంపల్లి శ్రీనివాసరావు రివ్యూ

తెదేపా హయాంలో కూల్చివేసిన దేవాలయాలను తిరిగి నిర్మిస్తామనీ.. వారి హయాంలో  నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన భూముల లీజును సమీక్షించి వాటిని రద్దు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

దేవాదాయశాఖ మంత్రి సమీక్ష
author img

By

Published : Oct 18, 2019, 7:55 PM IST

Updated : Oct 28, 2019, 8:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దేవదాయశాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసరావు విజయవాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై వారితో చర్చించారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం బడ్జెట్‌లో 234 కోట్లు కేటాయించామని తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు 5 వేల నుంచి 10 వేలు కేటాయిస్తామని వెల్లడించారు. ఆలయ‌ భూముల‌ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపిస్తామనీ.. దేవదాయశాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరినట్లు వివరించారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి జిల్లాల‌వారీగా కమిషనర్ స్థాయి అధికారుల సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

దేవాదాయశాఖ మంత్రి సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా దేవదాయశాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసరావు విజయవాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై వారితో చర్చించారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం బడ్జెట్‌లో 234 కోట్లు కేటాయించామని తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు 5 వేల నుంచి 10 వేలు కేటాయిస్తామని వెల్లడించారు. ఆలయ‌ భూముల‌ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపిస్తామనీ.. దేవదాయశాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరినట్లు వివరించారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి జిల్లాల‌వారీగా కమిషనర్ స్థాయి అధికారుల సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

దేవాదాయశాఖ మంత్రి సమీక్ష

ఇవీ చదవండి..

చిలుకతో షికారు... తీసుకొచ్చెను హుషారు...

sample description
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.