ETV Bharat / city

LOKESH: వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది - లోకేశ్‌ - ap latest news

LOKESH: జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితిని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు చెప్పిన గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మ‌హిళపై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయ‌మ్మకి స‌మాధానం చెప్పే ద‌మ్ములేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ధ్వజమెత్తారు.

LOKESH
ఎస్సీ మ‌హిళపై వైకాపా నేతల దాడిని ఖండించిన లోకేశ్‌
author img

By

Published : May 17, 2022, 2:15 PM IST

LOKESH: గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మ‌హిళపై వైకాపా నేతల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయ‌మ్మకి స‌మాధానం చెప్పే ద‌మ్ములేకనే కంతేరులోని ఆమె ఇంటిపై దాడిచేసి బెదిరించారని మండిపడ్డారు. జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితిని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు వెంకాయమ్మ చెప్పారని, ఆ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. వెంకాయ‌మ్మ, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌కు ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్రప‌రిణామాలు త‌ప్పవని హెచ్చరించారు. వైకాపా ద‌గ్గర ఉన్నది కిరాయి మూక‌లైతే.. తెదేపా ద‌గ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్షలాది మంది సైనికులని లోకేశ్‌ స్పష్టం చేశారు. నిర‌క్షరాస్య, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోందన్నారు. 5 కోట్ల మందిపైనా జగన్ రెడ్డి దాడి చేయిస్తారా అని లోకేశ్‌ నిలదీశారు.

  • వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ప‌రిణామాలు త‌ప్ప‌వు. మీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లు..మా ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులు.(2/3)

    — Lokesh Nara (@naralokesh) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

LOKESH: గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మ‌హిళపై వైకాపా నేతల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయ‌మ్మకి స‌మాధానం చెప్పే ద‌మ్ములేకనే కంతేరులోని ఆమె ఇంటిపై దాడిచేసి బెదిరించారని మండిపడ్డారు. జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితిని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు వెంకాయమ్మ చెప్పారని, ఆ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. వెంకాయ‌మ్మ, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌కు ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్రప‌రిణామాలు త‌ప్పవని హెచ్చరించారు. వైకాపా ద‌గ్గర ఉన్నది కిరాయి మూక‌లైతే.. తెదేపా ద‌గ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్షలాది మంది సైనికులని లోకేశ్‌ స్పష్టం చేశారు. నిర‌క్షరాస్య, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోందన్నారు. 5 కోట్ల మందిపైనా జగన్ రెడ్డి దాడి చేయిస్తారా అని లోకేశ్‌ నిలదీశారు.

  • వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ప‌రిణామాలు త‌ప్ప‌వు. మీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లు..మా ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులు.(2/3)

    — Lokesh Nara (@naralokesh) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.