ETV Bharat / city

చిత్తూరు, కృష్ణాలో మద్యం అక్రమ రవాణా.. సరకు స్వాధీనం

author img

By

Published : Apr 20, 2021, 9:41 PM IST

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. 70 కేసుల కర్ణాటక మద్యంను చిత్తూరులో పోలీసులు పట్టుకోగా.. 216 తెలంగాణ మద్యం సీసాలను నందిగామలో స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor caught, telangana karnataka liquor in ap
రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, తెలంగాణ కర్ణాటక మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న 70 కేసులను, వాటిని తరలించడానికి ఉపయోగించిన 3 విలువైన కార్లను సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఎస్​ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం'

నగరంలోని తేనెబండ, రాజీవ్ నగర్​లో కొందరు వ్యక్తులు.. కర్ణాటక మద్యం కేసులను వాహనాల నుంచి దింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక జ్యోతీశ్వరన్​తో పాటు మదనపల్లి పట్టణానికి చెందిన చామంచి మల్లికార్జున, కోలారుకు చెందిన మోహన్, ఐరాల మండలం నాంపల్లికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లాలో...

నందిగామ డీఎస్పీ కార్యాలయం సమీపంలోని మధిర రోడ్డులో.. అక్రమంగా తరలిస్తున్న 216 తెలంగాణ మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: జనసేన అధికార ప్రతినిధి

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న 70 కేసులను, వాటిని తరలించడానికి ఉపయోగించిన 3 విలువైన కార్లను సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఎస్​ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం'

నగరంలోని తేనెబండ, రాజీవ్ నగర్​లో కొందరు వ్యక్తులు.. కర్ణాటక మద్యం కేసులను వాహనాల నుంచి దింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక జ్యోతీశ్వరన్​తో పాటు మదనపల్లి పట్టణానికి చెందిన చామంచి మల్లికార్జున, కోలారుకు చెందిన మోహన్, ఐరాల మండలం నాంపల్లికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లాలో...

నందిగామ డీఎస్పీ కార్యాలయం సమీపంలోని మధిర రోడ్డులో.. అక్రమంగా తరలిస్తున్న 216 తెలంగాణ మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: జనసేన అధికార ప్రతినిధి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.