పాకిస్థాన్లో చిక్కుకున్న తెలుగు యువకుడి కథ సుఖాంతమయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రశాంత్ను పాక్ అధికారులు భారత్కు అప్పగించారు. ఆన్లైన్లో పరిచయమైన ప్రేయసి కోసం 2017 ఏప్రిల్లో పాక్ వెళ్లాడు. సరిహద్దుల ద్వారా అక్రమంగా పాకిస్థాన్లోకి చొరబడిన ప్రశాంత్ను.. అక్కడి అధికారులు బంధించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే తన కుమారుడి విడుదల కోసం ప్రశాంత్ తండ్రి బాబురావు అనేక ప్రయత్నాలు చేశారు. 2019లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి అభ్యర్థించారు. స్పందించిన సీపీ.. ప్రశాంత్ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనేక ప్రయత్నాల అనంతరం వాఘా సరిహద్దులో ప్రశాంత్ను భారత్కు అప్పగించారు.. పాక్ అధికారులు.
నాలుగేళ్ల తర్వాత ప్రశాంత్ భారత్కు చేరుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రశాంత్ హైదరాబాద్ రానున్నాడు.