ETV Bharat / city

కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ - కరోనాపై బండారు దత్తాత్రేయ సూచనలు న్యూస్

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. కొవిడ్​ జనాందోళన్​ సందేశమిచ్చారు. కరోనా మహమ్మారిపై యుద్ధం పూర్తి కాలేదని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సబ్బుతో చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు.

కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ
కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ
author img

By

Published : Oct 10, 2020, 7:31 PM IST

కరోనా మహమ్మారిపై యుద్ధం పూర్తి కాలేదని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కొవిడ్‌ జనాందోళన్ సందేశంలో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సబ్బుతో చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో రెండు గజాల దూరం పాటించి.. బాధ్యతాయుత పౌరుడిగా నియమాలు పాటించాలని బండారు దత్తాత్రేయ కోరారు. కరోనాపై విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారన్నారు. జనాందోళన్​లో భాగస్వామ్యం అయి కరోనా విముక్తికి యువత ముందుకు రావాలని దత్తాత్రేయ కోరారు.

కరోనా మహమ్మారిపై యుద్ధం పూర్తి కాలేదని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కొవిడ్‌ జనాందోళన్ సందేశంలో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సబ్బుతో చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో రెండు గజాల దూరం పాటించి.. బాధ్యతాయుత పౌరుడిగా నియమాలు పాటించాలని బండారు దత్తాత్రేయ కోరారు. కరోనాపై విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారన్నారు. జనాందోళన్​లో భాగస్వామ్యం అయి కరోనా విముక్తికి యువత ముందుకు రావాలని దత్తాత్రేయ కోరారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.