ETV Bharat / city

HIGH COURT: నీలం సాహ్నిపై పిటిషన్‌లో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

author img

By

Published : Aug 10, 2021, 3:22 AM IST

హైకోర్టులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంలో విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.

HIGH COURT
HIGH COURT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్నిని ఎస్​ఈసీ(SEC)గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ(SEC) కాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. ఆమె నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్నిని ఎస్​ఈసీ(SEC)గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ(SEC) కాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. ఆమె నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:

Covid Control: వివాహాలు, ధార్మిక సభలకు 150 మందికే అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.