ETV Bharat / city

నకిలీ స్టిక్కర్లు అంటించి కాలం చెల్లిన మందుల పంపిణీపై నేడు విచారణ

author img

By

Published : Jun 10, 2021, 3:36 AM IST

వైద్య సిబ్బంది కొందరూ.. కాలం చెల్లిన మందులకు నకిలీ స్టిక్కర్లు అంటించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు అందిస్తున్నారంటూ వచ్చిన లేఖను పిల్​గా పరిగణించిన హైకోర్టు.. దానిపై నేడు విచారణ జరపనుంది.

high court latest hearing
హైకోర్టు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొందరు నకిలీ స్టిక్కర్లు అంటించి కాలం చెల్లిన మందులను కొవిడ్ బాధితులకు అందిస్తున్నారని పేర్కొంటూ.. గుంటూరుకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగిందని మణిరత్నం హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీడియో ఆధారాలను లేఖకు జతచేశారు. ఫోన్ సంభాషణలు సైతం తన వద్ద ఉన్నాయన్నారు. ఆ లేఖను పరిశీలించిన పిల్ కమిటీ సభ్యులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావులు.. దాన్ని పిల్​గా పరిగణించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. హైకోర్టు సీజే ఆదేశాల మేరకు రిజిస్ట్రీ ఆ లేఖను సుమోటో పిల్​గా మలిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, ఔషధ నియంత్రణ అథార్టీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

మతిస్థిమితం కోల్పోయిన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలంటూ అందిన లేఖపై...

మతిస్థిమితం కోల్పోయిన వారి విషయంలో మెంటల్ హెల్త్ కేర్(ఎంహెచ్​సీ) చట్ట నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ... విశాఖపట్నం ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసర్ డా. రామానంద్ సతాపతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించింది. మతిస్థిమితం సక్రమంగా లేక రహదారుల వెంట తిరిగే వారిని మెంటల్ హెల్త్ కేర్ చట్ట ప్రకారం ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఆయా పరిధిలోని పోలీసులపై ఉందని లేఖలో పేర్కొన్నారు.

స్పందన లేదు..

పోలీసుల బాధ్యత గురించి విశాఖ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లానన్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఆసుపత్రుల్లో చేర్పించడానికి సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి పోలీసులు రిసెప్షన్ ఉత్తర్వులు పొందాల్సి ఉందన్నారు. డాక్టర్ రామానంద్ రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించొచ్చని హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం నేడు ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.

ఇదీ చదవండి..

cheating:కుమార్తెను ఇచ్చాడు..ప్రభుత్వ సాయం కోసం నకిలీ పత్రాలు సృష్టించాడు..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొందరు నకిలీ స్టిక్కర్లు అంటించి కాలం చెల్లిన మందులను కొవిడ్ బాధితులకు అందిస్తున్నారని పేర్కొంటూ.. గుంటూరుకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగిందని మణిరత్నం హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీడియో ఆధారాలను లేఖకు జతచేశారు. ఫోన్ సంభాషణలు సైతం తన వద్ద ఉన్నాయన్నారు. ఆ లేఖను పరిశీలించిన పిల్ కమిటీ సభ్యులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావులు.. దాన్ని పిల్​గా పరిగణించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. హైకోర్టు సీజే ఆదేశాల మేరకు రిజిస్ట్రీ ఆ లేఖను సుమోటో పిల్​గా మలిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, ఔషధ నియంత్రణ అథార్టీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

మతిస్థిమితం కోల్పోయిన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలంటూ అందిన లేఖపై...

మతిస్థిమితం కోల్పోయిన వారి విషయంలో మెంటల్ హెల్త్ కేర్(ఎంహెచ్​సీ) చట్ట నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ... విశాఖపట్నం ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసర్ డా. రామానంద్ సతాపతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా పరిగణించింది. మతిస్థిమితం సక్రమంగా లేక రహదారుల వెంట తిరిగే వారిని మెంటల్ హెల్త్ కేర్ చట్ట ప్రకారం ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఆయా పరిధిలోని పోలీసులపై ఉందని లేఖలో పేర్కొన్నారు.

స్పందన లేదు..

పోలీసుల బాధ్యత గురించి విశాఖ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లానన్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఆసుపత్రుల్లో చేర్పించడానికి సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి పోలీసులు రిసెప్షన్ ఉత్తర్వులు పొందాల్సి ఉందన్నారు. డాక్టర్ రామానంద్ రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించొచ్చని హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం నేడు ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.

ఇదీ చదవండి..

cheating:కుమార్తెను ఇచ్చాడు..ప్రభుత్వ సాయం కోసం నకిలీ పత్రాలు సృష్టించాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.