ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళిపట్నం రామారావు(Kara master) మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కాళిపట్నం రామారావు తెలుగులో చిన్న కథల రచయితగా ప్రసిద్ధి చెందటమే కాక, ఆయన ప్రతిభకు కొలమానంగా అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డిగ్రీలను ప్రదానం చేశాయన్నారు. కథానిలయం తెలుగు కథకు శాశ్వత చిరునామాగా మారిందని సీఎం జగన్ కొనియాడారు.
ఇదీ చదవండి