ETV Bharat / city

ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు గవర్నర్​, సీఎం జగన్​ అభినందనలు - Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ బిష్వభూషణ్, సీఎం జగన్.. నీరజ్​కు శుభాక్షాంక్షలు తెలిపారు. నీరజ్ గెలుపుతో యావత్ భారత దేశం గర్విస్తోందని ప్రసంశించారు.

టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా
author img

By

Published : Aug 7, 2021, 8:27 PM IST

టోక్వో ఒలింపిక్స్ జావిలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రాను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు తలెత్తుకునేటట్లు చేశారని ప్రశంసించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్​లో భారత్​కు ఇది తొలిస్వర్ణం కాగా.. నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది: జగన్​

జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని.. ఈ ఒలంపిక్స్​లో భారత్​కు మొదటి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాను మనసారా అభినందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నీరజ్ గెలుపుతో యావత్ భారత దేశం గర్విస్తోందని జగన్ అన్నారు. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్​లో భారత్ మరిన్ని మెడల్స్ గెలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలిచిన బజరంగ్ పునియానుకు సీఎం అభినందనలు తెలిపారు. రెస్లింగ్ పోటీలో ఆయన చూపిన తెగువ, ఆత్మస్థైర్యం కొనియాడదగినవని అని అన్నారు.


ఇదీ చదవండి...

PULICHINTALA: అర కిలోమీటర్​ దూరంలో క్రస్ట్‌ గేటు లభ్యం

టోక్వో ఒలింపిక్స్ జావిలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రాను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు తలెత్తుకునేటట్లు చేశారని ప్రశంసించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్​లో భారత్​కు ఇది తొలిస్వర్ణం కాగా.. నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది: జగన్​

జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని.. ఈ ఒలంపిక్స్​లో భారత్​కు మొదటి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాను మనసారా అభినందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నీరజ్ గెలుపుతో యావత్ భారత దేశం గర్విస్తోందని జగన్ అన్నారు. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్​లో భారత్ మరిన్ని మెడల్స్ గెలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలిచిన బజరంగ్ పునియానుకు సీఎం అభినందనలు తెలిపారు. రెస్లింగ్ పోటీలో ఆయన చూపిన తెగువ, ఆత్మస్థైర్యం కొనియాడదగినవని అని అన్నారు.


ఇదీ చదవండి...

PULICHINTALA: అర కిలోమీటర్​ దూరంలో క్రస్ట్‌ గేటు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.