ETV Bharat / city

రాష్ట్రంలో వర్క్​ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లు: మంత్రి గౌతం రెడ్డి

author img

By

Published : Sep 4, 2021, 2:18 AM IST

రాష్ట్రంలో 'వర్క్ ఇన్ హోమ్ టౌన్' సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన నమూనాను పది రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఐటీ, నైపుణ్య, ఫైబర్​నెట్ అధికారులతో టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో వర్క్​ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లు
రాష్ట్రంలో వర్క్​ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లు

రాష్ట్రంలో వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి చెందిన 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది స్వగ్రామం నుంచే పని చేసుకునేలా వర్క్ ఇన్ హోమ్ టౌన్లను ఏర్పాటు చేయాలని పరిశ్రమలు ,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సదుపాయాలు, అవసరాలు, నమూనా రూపకల్పన కోసం ఫైబర్ నెట్ ఉన్నతా ధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడెక్కడో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సొంత ఊళ్లలోనే నిశ్చింతగా పని చేసుకునే విధంగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

సెప్టెంబర్ మూడో వారంలోగా బిజినెస్ సెంటర్ల ఏర్పాటులో కీలకమైన మోడళ్లను తయారు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీకి సూచించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్ర, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ సాధ్యమైనంత వేగంగా వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించాలని, అందుకు అవసరమైన ఇంటర్ నెట్, విద్యుత్ వంటి మౌలిక వసతుల వ్యయాల అంచనాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

ఇంజనీరింగ్ కాలేజీలలోని ఐటీ ల్యాబ్​ల జాబితా సహా సాప్ట్​వేర్ ఉద్యోగం స్వగ్రామంలోనే చేసుకునే వీలుగా ఉండే ప్రాంతాలను చూసి అనుకూలమైనవాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. వాటికి అవసరమైన ప్రోత్సహకాల విషయంపైనా సమీక్షించాలన్నారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల నమూనా కోసం బెంగళూరు, హైదరాబాద్ పెద్ద ప్రాంతాలలోని సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సకల వసతులు ఉన్న 100 సెంటర్లు సిద్ధంగా ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ.. మంత్రి దృష్టికి తీసుకు వచ్చింది. వెంటనే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

TDP protest: 'తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలి'

రాష్ట్రంలో వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి చెందిన 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది స్వగ్రామం నుంచే పని చేసుకునేలా వర్క్ ఇన్ హోమ్ టౌన్లను ఏర్పాటు చేయాలని పరిశ్రమలు ,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సదుపాయాలు, అవసరాలు, నమూనా రూపకల్పన కోసం ఫైబర్ నెట్ ఉన్నతా ధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడెక్కడో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సొంత ఊళ్లలోనే నిశ్చింతగా పని చేసుకునే విధంగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

సెప్టెంబర్ మూడో వారంలోగా బిజినెస్ సెంటర్ల ఏర్పాటులో కీలకమైన మోడళ్లను తయారు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీకి సూచించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్ర, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ సాధ్యమైనంత వేగంగా వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించాలని, అందుకు అవసరమైన ఇంటర్ నెట్, విద్యుత్ వంటి మౌలిక వసతుల వ్యయాల అంచనాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

ఇంజనీరింగ్ కాలేజీలలోని ఐటీ ల్యాబ్​ల జాబితా సహా సాప్ట్​వేర్ ఉద్యోగం స్వగ్రామంలోనే చేసుకునే వీలుగా ఉండే ప్రాంతాలను చూసి అనుకూలమైనవాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. వాటికి అవసరమైన ప్రోత్సహకాల విషయంపైనా సమీక్షించాలన్నారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల నమూనా కోసం బెంగళూరు, హైదరాబాద్ పెద్ద ప్రాంతాలలోని సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సకల వసతులు ఉన్న 100 సెంటర్లు సిద్ధంగా ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ.. మంత్రి దృష్టికి తీసుకు వచ్చింది. వెంటనే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

TDP protest: 'తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.