ETV Bharat / city

విజయవాడలో ప్రారంభమైన ఫలపుష్ప ప్రదర్శన

author img

By

Published : Jan 3, 2020, 5:35 PM IST

విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో... ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. ఈ రోజు నుంచి జనవరి 6 వరకు దీన్ని నిర్వహించనున్నారు.

flower show in vijayawada
విజయవాడలో ప్రారంభమైన ఫలపుష్ప ప్రదర్శన
విజయవాడలో ప్రారంభమైన ఫలపుష్ప ప్రదర్శన

విజయవాడలో ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఈ రోజు నుంచి జనవరి 6 వరకు జరగనుంది. హరితప్రియ ప్లాంట్‌ లవర్స్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ రోజ్‌ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పుష్పప్రదర్శనను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ ప్రారంభించారు.

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు.. మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. సుమారు మూడు వందల రకాలపైగా గులాబీ, ఐదు వందల రకాలకుపైగా చామంతి మొక్కలను కాకినాడ, కడియం, పుణె, బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. ఆర్కిడ్స్​, బోన్సాయ్‌, ఇండో తదితర మొక్కలను ప్రదర్శించారు. సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో సాగుచేసే రైతులకు ప్రత్యేకమైన స్టాల్స్‌ కేటాయించారు.

ఇదీ చదవండి

రాజధానిపై సీఎంకు అందిన బోస్టన్​ నివేదిక

విజయవాడలో ప్రారంభమైన ఫలపుష్ప ప్రదర్శన

విజయవాడలో ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఈ రోజు నుంచి జనవరి 6 వరకు జరగనుంది. హరితప్రియ ప్లాంట్‌ లవర్స్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ రోజ్‌ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పుష్పప్రదర్శనను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ ప్రారంభించారు.

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు.. మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. సుమారు మూడు వందల రకాలపైగా గులాబీ, ఐదు వందల రకాలకుపైగా చామంతి మొక్కలను కాకినాడ, కడియం, పుణె, బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. ఆర్కిడ్స్​, బోన్సాయ్‌, ఇండో తదితర మొక్కలను ప్రదర్శించారు. సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో సాగుచేసే రైతులకు ప్రత్యేకమైన స్టాల్స్‌ కేటాయించారు.

ఇదీ చదవండి

రాజధానిపై సీఎంకు అందిన బోస్టన్​ నివేదిక

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.