ETV Bharat / city

పడకేసిన పారిశుద్ధ్యం.. విష జ్వరాల విజృంభణ.. కదలని యంత్రాంగం

వర్షాలొస్తే జ్వరాలు వస్తాయని అందరికీ తెలుసు. జ్వర పీడితులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారో కూడా యంత్రాంగం వద్ద రికార్డులు ఉంటాయి. ఈ జాబితాల ఆధారంగా జ్వరాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు చోద్యం చూస్తున్నాయి. తెనాలి, విజయవాడ శివారు గ్రామాల్లో కలుషితనీరు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం, వందల మంది ఆసుపత్రుల పాలవడం ప్రభుత్వ శాఖల అసమర్థతకు నిదర్శనం. మలేరియా, డెంగీ విజృంభిస్తున్నా యంత్రాంగంలో కదలిక లేకపోవటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

author img

By

Published : Jul 31, 2022, 4:43 AM IST

పడకేసిన పారిశుద్ధ్యం
పడకేసిన పారిశుద్ధ్యం

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం పట్టుతప్పినా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. పంచాయతీల్లో నిధుల సంక్షోభంతో మురుగుకాల్వల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలు మొక్కుబడిగా మారాయి. నీటి కలుషితాలను గుర్తించాల్సిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు.. అంతా బాగున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు ఎక్కువవడంతో దోమలు వృద్ధి చెంది.. జ్వరాలను పెంచుతున్నాయి. ఇంట్లో, బయట నీటి నిల్వలు ఉంటే డెంగీ కోరి తెచ్చుకున్నట్లే. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 461 గ్రామాలు ఉండగా బ్లీచింగ్‌ చల్లడానికి నిధులు లేవు. ఇంత జరుగుతున్నా పట్టణ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

1,251 డెంగీ, 819 మలేరియా కేసులు: అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 29 వారాల్లో 654 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 1,251 వచ్చాయి. మలేరియా కేసులు నిరుడు 846 నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 819 వచ్చాయి. విశాఖ జిల్లాలో 356 డెంగీ కేసులు రాగా... విజయనగరం, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గరిష్ఠ స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 495, పార్వతీపురం మన్యం జిల్లాలో 182 చొప్పున అధికారికంగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో 2021లో 90 డెంగీ కేసులు వస్తే ఈ ఏడాది ఇప్పటికే 48 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జ్వరపీడితులు ఎక్కువగా కనిపిస్తుండగా.. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం తక్కువగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే వారు వేలల్లోనే ఉంటున్నారు. వీరి నుంచి నిర్థారణ పరీక్షలు, చికిత్సల పేరుతో ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు వేల రూపాయలు గుంజుతున్నారు. జిల్లాల అధికారులు తొలి నుంచీ జ్వరాల కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు. దాచాల్సిన అవసరంలేదని, ఖచ్చితంగా చెబితే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని సీనియర్‌ ఉన్నతాధికారి రెండురోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో జిల్లా అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ కేసులు వచ్చిన చుట్టుపక్కల ఉండే 50 ఇళ్లలోని వారికి వెంటనే ఆరోగ్య సిబ్బంది రక్త పరీక్షలు చేయాలి. ఇది చాలాచోట్ల జరగడం లేదు.

  • యాప్‌లో ఫొటోలు ఉంటాయంతే..!
    పంచాయతీల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు ‘హైజీన్‌’ యాప్‌ ద్వారా ఈ నెల 1 నుంచి 21 మధ్య నీరు నిల్వ ఉన్న 14,186 ప్రాంతాలను నమోదు చేశారు. 8,746 చోట్ల మాత్రమే సమస్య పరిష్కారమైంది.
  • అనకాపల్లి జిల్లాలో 489 చోట్ల నీరు నిల్వ ఉందని ఆరోగ్య సిబ్బంది యాప్‌లో నమోదు చేస్తే 101 మాత్రమే పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
  • చిత్తూరు జిల్లాలో 1552కు 1,005 పరిష్కారం కాలేదు. అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
  • మున్సిపాలిటీల పరిధిలో 5,667 సమస్యల గురించి యాప్‌లో నమోదు చేయగా 2,389 పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. చిత్తూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, కడప, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పురపాలక అధికారుల స్పందన తక్కువగా ఉంది. మరోవైపు చాలాచోట్ల ఏఎన్‌ఎంలు నీటి నిల్వల ఫొటోలను యాప్‌లో పెట్టడమే మర్చిపోయారు.
  • ‘ఫ్రైడే.. డ్రైడే’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. దీనికీ అతీగతీ లేదు.

నిర్ధారణ పరీక్షలు పెంచాలంటే కిట్లు కావాలి!: రాష్ట్రంలోని ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలోనూ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన ఎంఎల్‌హెచ్‌పీలు ఉన్నారు. వీరి సేవలను ఉపయోగించుకుంటే ఫలితాలు కనిపిస్తాయి. డెంగీనా కాదా అని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ర్యాపిడ్‌ పరీక్షలు దోహదపడతాయి. ఇందుకు కిట్ల కొరత ఉంది. 104 సంచార వైద్యశాలల ద్వారా రోగులకు చికిత్సతోపాటు గ్రామాల్లో నీటి పరీక్షలు చేయాలి.

అన్నిస్థాయుల్లోనూ సిబ్బంది కొరతే..

  • పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో మలేరియా జ్వరాల నియంత్రణ అధికారులు లేరు. తెనాలి మలేరియా సబ్‌ యూనిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మలేరియా అధికారి, 4 ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో రక్త పరీక్షలు అటకెక్కాయి.
  • ఒంగోలు నగరంలోని జిల్లా మలేరియా నివారణ కార్యాలయంలో 18 మంది ఉండాలి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ పోస్టులు 8 ఉంటే ఇద్దరే పనిచేస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్లు లేక ల్యాబ్‌ దాదాపు మూతపడింది.
  • ఒంగోలు జీజీహెచ్‌ తర్వాత కీలకమైన మార్కాపురం జిల్లా వైద్యశాలలో గత 15 నెలల నుంచి రక్తనిధి కేంద్రాలకు తాళాలుపడ్డాయి.
  • పరీక్షలు చేసే మూడు యంత్రాలు పూర్తిగా పనికిరాకుండాపోయాయి. అయితే ‘డెంగీ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని, రక్త కణాలు తగ్గిన వారిని ఒంగోలు రిమ్స్‌కు పంపుతున్నాం. ఇక్కడ ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం లేదు’ అని మార్కాపురం జిల్లా వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్‌ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.

అతిసారంతో మరణాలు.. అయినా మారని అధికారులు: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం లక్షణాలతో ఈ నెల 15న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే దీనికి కారణమని అధికారులు తేల్చారు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిలో నేటికీ ఇసుమంత మార్పు లేదు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగునీరు పారుతూ దుర్వాసన వస్తోంది. దోమలు ముసురుతున్నాయి. సంఘటన తర్వాత ఇటీవల కొత్త పైపులైన్లు వేశారు. అవీ మురుగునీటిలో నుంచే వేయడంతో అందులోనే నిల్చుని మంచినీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. అతిసారం మరణాలతో రెండు రోజులు హడావుడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవడమే మానేశారు.

  • డెంగీ జ్వరాల నిర్ధారణ కోసం ఆరోగ్య ఉప కేంద్రాల్లో ర్యాపిడ్‌ కిట్లు మూడు, నాలుగే ఉంటున్నాయి. దీంతో ఎక్కువ మందికి లక్షణాలున్నా పరీక్షలు చేయలేకపోతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడే వారికి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం కూడా మార్కాపురంలోని జిల్లా ఆసుపత్రిలో లేదు.
  • జిల్లాల్లో పర్యవేక్షణ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. డిప్యుటేషన్లను రద్దు చేసినందున కింది స్థాయి అవసరాలకు సరిపడా సిబ్బంది లేరు. తెనాలి, ఒంగోలులో మలేరియా నియంత్రణ కేంద్రాల్లో సరిపడా ల్యాబ్‌ టెక్నీషియన్లు లేక జ్వర నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు.
  • ఏఎన్‌ఎంలు నీటి నిల్వల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వెంటనే అక్కడ నీటిని తొలగించి గుంతలు పూడ్చాల్సిన మున్సిపల్‌/ పంచాయతీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
  • జ్వరాలు, డయేరియా కేసులను జిల్లా అధికారులు తగ్గించి చూపిస్తున్నారు. జ్వరాల కేసులు బహిరంగంగా కనిపిస్తున్నా లేవని చెబుతున్నారు.

ఇవీ చూడండి

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం పట్టుతప్పినా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. పంచాయతీల్లో నిధుల సంక్షోభంతో మురుగుకాల్వల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలు మొక్కుబడిగా మారాయి. నీటి కలుషితాలను గుర్తించాల్సిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు.. అంతా బాగున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు ఎక్కువవడంతో దోమలు వృద్ధి చెంది.. జ్వరాలను పెంచుతున్నాయి. ఇంట్లో, బయట నీటి నిల్వలు ఉంటే డెంగీ కోరి తెచ్చుకున్నట్లే. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 461 గ్రామాలు ఉండగా బ్లీచింగ్‌ చల్లడానికి నిధులు లేవు. ఇంత జరుగుతున్నా పట్టణ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

1,251 డెంగీ, 819 మలేరియా కేసులు: అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 29 వారాల్లో 654 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 1,251 వచ్చాయి. మలేరియా కేసులు నిరుడు 846 నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 819 వచ్చాయి. విశాఖ జిల్లాలో 356 డెంగీ కేసులు రాగా... విజయనగరం, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గరిష్ఠ స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 495, పార్వతీపురం మన్యం జిల్లాలో 182 చొప్పున అధికారికంగా మలేరియా కేసులు రికార్డయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో 2021లో 90 డెంగీ కేసులు వస్తే ఈ ఏడాది ఇప్పటికే 48 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జ్వరపీడితులు ఎక్కువగా కనిపిస్తుండగా.. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం తక్కువగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే వారు వేలల్లోనే ఉంటున్నారు. వీరి నుంచి నిర్థారణ పరీక్షలు, చికిత్సల పేరుతో ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు వేల రూపాయలు గుంజుతున్నారు. జిల్లాల అధికారులు తొలి నుంచీ జ్వరాల కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు. దాచాల్సిన అవసరంలేదని, ఖచ్చితంగా చెబితే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని సీనియర్‌ ఉన్నతాధికారి రెండురోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో జిల్లా అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ కేసులు వచ్చిన చుట్టుపక్కల ఉండే 50 ఇళ్లలోని వారికి వెంటనే ఆరోగ్య సిబ్బంది రక్త పరీక్షలు చేయాలి. ఇది చాలాచోట్ల జరగడం లేదు.

  • యాప్‌లో ఫొటోలు ఉంటాయంతే..!
    పంచాయతీల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు ‘హైజీన్‌’ యాప్‌ ద్వారా ఈ నెల 1 నుంచి 21 మధ్య నీరు నిల్వ ఉన్న 14,186 ప్రాంతాలను నమోదు చేశారు. 8,746 చోట్ల మాత్రమే సమస్య పరిష్కారమైంది.
  • అనకాపల్లి జిల్లాలో 489 చోట్ల నీరు నిల్వ ఉందని ఆరోగ్య సిబ్బంది యాప్‌లో నమోదు చేస్తే 101 మాత్రమే పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
  • చిత్తూరు జిల్లాలో 1552కు 1,005 పరిష్కారం కాలేదు. అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
  • మున్సిపాలిటీల పరిధిలో 5,667 సమస్యల గురించి యాప్‌లో నమోదు చేయగా 2,389 పరిష్కరించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. చిత్తూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, కడప, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పురపాలక అధికారుల స్పందన తక్కువగా ఉంది. మరోవైపు చాలాచోట్ల ఏఎన్‌ఎంలు నీటి నిల్వల ఫొటోలను యాప్‌లో పెట్టడమే మర్చిపోయారు.
  • ‘ఫ్రైడే.. డ్రైడే’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. దీనికీ అతీగతీ లేదు.

నిర్ధారణ పరీక్షలు పెంచాలంటే కిట్లు కావాలి!: రాష్ట్రంలోని ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలోనూ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన ఎంఎల్‌హెచ్‌పీలు ఉన్నారు. వీరి సేవలను ఉపయోగించుకుంటే ఫలితాలు కనిపిస్తాయి. డెంగీనా కాదా అని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ర్యాపిడ్‌ పరీక్షలు దోహదపడతాయి. ఇందుకు కిట్ల కొరత ఉంది. 104 సంచార వైద్యశాలల ద్వారా రోగులకు చికిత్సతోపాటు గ్రామాల్లో నీటి పరీక్షలు చేయాలి.

అన్నిస్థాయుల్లోనూ సిబ్బంది కొరతే..

  • పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో మలేరియా జ్వరాల నియంత్రణ అధికారులు లేరు. తెనాలి మలేరియా సబ్‌ యూనిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మలేరియా అధికారి, 4 ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో రక్త పరీక్షలు అటకెక్కాయి.
  • ఒంగోలు నగరంలోని జిల్లా మలేరియా నివారణ కార్యాలయంలో 18 మంది ఉండాలి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ పోస్టులు 8 ఉంటే ఇద్దరే పనిచేస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్లు లేక ల్యాబ్‌ దాదాపు మూతపడింది.
  • ఒంగోలు జీజీహెచ్‌ తర్వాత కీలకమైన మార్కాపురం జిల్లా వైద్యశాలలో గత 15 నెలల నుంచి రక్తనిధి కేంద్రాలకు తాళాలుపడ్డాయి.
  • పరీక్షలు చేసే మూడు యంత్రాలు పూర్తిగా పనికిరాకుండాపోయాయి. అయితే ‘డెంగీ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని, రక్త కణాలు తగ్గిన వారిని ఒంగోలు రిమ్స్‌కు పంపుతున్నాం. ఇక్కడ ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం లేదు’ అని మార్కాపురం జిల్లా వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్‌ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.

అతిసారంతో మరణాలు.. అయినా మారని అధికారులు: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం లక్షణాలతో ఈ నెల 15న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే దీనికి కారణమని అధికారులు తేల్చారు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిలో నేటికీ ఇసుమంత మార్పు లేదు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగునీరు పారుతూ దుర్వాసన వస్తోంది. దోమలు ముసురుతున్నాయి. సంఘటన తర్వాత ఇటీవల కొత్త పైపులైన్లు వేశారు. అవీ మురుగునీటిలో నుంచే వేయడంతో అందులోనే నిల్చుని మంచినీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. అతిసారం మరణాలతో రెండు రోజులు హడావుడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవడమే మానేశారు.

  • డెంగీ జ్వరాల నిర్ధారణ కోసం ఆరోగ్య ఉప కేంద్రాల్లో ర్యాపిడ్‌ కిట్లు మూడు, నాలుగే ఉంటున్నాయి. దీంతో ఎక్కువ మందికి లక్షణాలున్నా పరీక్షలు చేయలేకపోతున్నారు. డెంగీ జ్వరంతో బాధపడే వారికి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం కూడా మార్కాపురంలోని జిల్లా ఆసుపత్రిలో లేదు.
  • జిల్లాల్లో పర్యవేక్షణ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. డిప్యుటేషన్లను రద్దు చేసినందున కింది స్థాయి అవసరాలకు సరిపడా సిబ్బంది లేరు. తెనాలి, ఒంగోలులో మలేరియా నియంత్రణ కేంద్రాల్లో సరిపడా ల్యాబ్‌ టెక్నీషియన్లు లేక జ్వర నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు.
  • ఏఎన్‌ఎంలు నీటి నిల్వల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వెంటనే అక్కడ నీటిని తొలగించి గుంతలు పూడ్చాల్సిన మున్సిపల్‌/ పంచాయతీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
  • జ్వరాలు, డయేరియా కేసులను జిల్లా అధికారులు తగ్గించి చూపిస్తున్నారు. జ్వరాల కేసులు బహిరంగంగా కనిపిస్తున్నా లేవని చెబుతున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.