ఐపీఎల్ జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా మార్చుకొని... బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. బెట్టింగ్కు ఉపయోగించిన 25 సెల్ఫోన్లు, ఎసీడీ, ల్యాఫ్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు.
ఇదీ చదవండి: అవతార్.. ఇదో కొత్త బెట్టింగ్ దందా..!