ETV Bharat / city

'అమరావతినే రాజధానిగా కొనసాగించాలి' - అమరావతి ఆందోళనకు సీపీఎం మద్దతు

అమరావతి పోరాటానికి సీపీఎం పార్టీ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ నేత మధు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్​లో అమరావతి పరిరక్షణ సమితి చేస్తున్న ఆందోళనలో మధు పాల్గొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

cpm suppots amarvathi protest
అమరావతి పోరాటానికి సీపీఎం మద్దతు
author img

By

Published : Jan 2, 2020, 3:04 PM IST

అమరావతి పోరాటానికి సీపీఎం మద్దతు

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో చేపట్టిన నిరసనలకు సీపీఎం మద్దతు తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఒకే చోట ఉండాలని మధు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే

మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్రం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

రాజధాని రైతులకు మద్దతుగా బోడె ప్రసాద్ దీక్ష

అమరావతి పోరాటానికి సీపీఎం మద్దతు

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో చేపట్టిన నిరసనలకు సీపీఎం మద్దతు తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఒకే చోట ఉండాలని మధు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే

మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్రం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

రాజధాని రైతులకు మద్దతుగా బోడె ప్రసాద్ దీక్ష

Intro:AP_VJA_18_02_AMARAVATHI_JAC_NIRASANA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 16వ రోజుకు చేరాయి. రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం హైకోర్టు అన్ని ఒకే చోట ఉండాలని ,అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజధాని అమరావతిని కొనసాగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మూడు రాజధానులు ప్రతిపాదన వలన వ్యాపారులు ఇతర రంగాలకు చెందిన వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తక్షణమే మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధ వెంకన్న ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి ప్రకటనల వలన రాష్ట్రం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. మూడు రాజధాని ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బైట్... బుద్ధ వెంకన్న తెదేపా అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ


Body:AP_VJA_18_02_AMARAVATHI_JAC_NIRASANA_AVB_AP10050


Conclusion:AP_VJA_18_02_AMARAVATHI_JAC_NIRASANA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.