ETV Bharat / city

రౌడీషీటర్​ పండుకు నగరబహిష్కరణ తప్పదా..? సీపీ ఏమంటున్నారు..?

విజయవాడలో సంచలనం రేపిన గ్యాంగ్​ వార్​ నిందితుడు పండు అరెస్ట్​పై సీపీ శ్రీనివాసులు మాట్లాడారు. నిందితుడి నగరబహిష్కరణపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బెయిల్​పై బయటకొచ్చిన పండు మళ్లీ కత్తులతో, కర్రలతో దాడులకు పాల్పడ్డ వీడియో బయటకు రావడంతో నగరవాసుల కంటిపై కునుకులేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

author img

By

Published : May 31, 2021, 7:11 PM IST

cp srinivasulu on rowdy pandu
రౌడీషీటర్​ పండు నగరబహిష్కరణపై సీపీ శ్రీనివాసులు

బెజవాడ రౌడీషీటర్ పండు కొందరిపై దాడి చేస్తున్న వీడియో బయటకు రావడంతో విజయవాడ సీపీ దానిపై స్పందించారు. నిందితుడు దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంపేందుకు ప్రయత్నించినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. పండును నగర బహిష్కరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పటమట పీఎస్ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో అరెస్టైన నిందితుడు పండు.. ఇటీవల బెయిల్​పై విడుదలైనట్లు తెలిపారు. అయితే నిందితుడు జైలు నుంచి వచ్చిన తర్వాత నగర బహిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి పండుపై నిఘా ఉంచామని సీపీ తెలిపారు. గతంలో పండు కత్తులతో హల్ చేస్తున్న వీడియోలు నగర వాసుల్ని భయపెట్టగా.. తాజా వీడియో బయటకు రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

విజయవాడ నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు మరోసారి రెచ్చిపోయాడు. పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. గ్యాంగ్​లోని ఓ సభ్యుడిపై కర్రతో దాడి చేశాడు. కత్తితో బెదిరించాడు. ఈ సంఘటనను చిత్రీకరించిన వీడియో.. బయటకు రావటంతో రౌడీషీటర్ పండును పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

బెజవాడ రౌడీషీటర్ పండు కొందరిపై దాడి చేస్తున్న వీడియో బయటకు రావడంతో విజయవాడ సీపీ దానిపై స్పందించారు. నిందితుడు దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంపేందుకు ప్రయత్నించినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. పండును నగర బహిష్కరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పటమట పీఎస్ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో అరెస్టైన నిందితుడు పండు.. ఇటీవల బెయిల్​పై విడుదలైనట్లు తెలిపారు. అయితే నిందితుడు జైలు నుంచి వచ్చిన తర్వాత నగర బహిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి పండుపై నిఘా ఉంచామని సీపీ తెలిపారు. గతంలో పండు కత్తులతో హల్ చేస్తున్న వీడియోలు నగర వాసుల్ని భయపెట్టగా.. తాజా వీడియో బయటకు రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

విజయవాడ నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు మరోసారి రెచ్చిపోయాడు. పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. గ్యాంగ్​లోని ఓ సభ్యుడిపై కర్రతో దాడి చేశాడు. కత్తితో బెదిరించాడు. ఈ సంఘటనను చిత్రీకరించిన వీడియో.. బయటకు రావటంతో రౌడీషీటర్ పండును పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

దీదీ ఎత్తుగడ.. ముఖ్య సలహాదారుగా బంధోపాధ్యాయ్​

విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.