ETV Bharat / city

సతీసమేతంగా పారిస్​ వెళ్లనున్న సీఎం జగన్​

author img

By

Published : Jun 27, 2022, 10:50 PM IST

Updated : Jun 28, 2022, 6:16 AM IST

CM YS Jagan To Visit Paris: ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా ఈరోజు పారిస్ పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి పారిస్​కు వెళ్తారు. జూలై 3న తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

CM YS Jagan To Visit Paris
CM YS Jagan To Visit Paris

CM JAGAN PARIS TOUR: ముఖ్యమంత్రి జగన్.. భార్య భారతీతో కలిసి పారిస్ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు అక్కడి నుంచి విమానంలో పారిస్​కు బయలుదేరుతారు. సీఎం దంపతులు.. ఈనెల 29న పారిస్​కు చేరుకుంటారు. జూలై 2న జగన్​ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి చదువుతున్న యూనివర్సిటీ కాన్వకేషన్​ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జూలై 3న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. హర్షా రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్​లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న విషయం తెలిసిందే.

CM JAGAN PARIS TOUR: ముఖ్యమంత్రి జగన్.. భార్య భారతీతో కలిసి పారిస్ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు అక్కడి నుంచి విమానంలో పారిస్​కు బయలుదేరుతారు. సీఎం దంపతులు.. ఈనెల 29న పారిస్​కు చేరుకుంటారు. జూలై 2న జగన్​ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి చదువుతున్న యూనివర్సిటీ కాన్వకేషన్​ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జూలై 3న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. హర్షా రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్​లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న విషయం తెలిసిందే.

ఇదీచదవండి:

Last Updated : Jun 28, 2022, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.