ETV Bharat / city

జీఎస్టీ పరిహారం..16 రాష్ట్రాలు, 3 యూటీలకు రూ.6 వేల కోట్లు విడుదల

జీఎస్టీ పరిహారంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ...కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 'స్పెషల్ బారోయింగ్ విండో' కింద నిధులు విడుదల కాగా...జీఎస్టీ పరిహారం కోసం ఏపీ ప్రత్యేక విండోను ఎంచుకొంది.

author img

By

Published : Nov 2, 2020, 8:49 PM IST

జీఎస్టీ పరిహారంగా 16 రాష్ట్రాలు
జీఎస్టీ పరిహారంగా 16 రాష్ట్రాలు

జీఎస్టీ పరిహారంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ...కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 'స్పెషల్ బారోయింగ్ విండో' కింద నిధులు విడుదలయ్యాయి. స్పెషల్‌ బారోయింగ్‌ విండో కింద ఇప్పటికే రూ.12 వేల కోట్ల రుణం ఇచ్చిన కేంద్రం...జీఎస్టీ పరిహారం సెస్ కొరత తీర్చేందుకు రాష్ట్రాలకు నిధుల విడుదల చేసింది.

ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి భేటీలో..కేంద్రం ఇవ్వాల్సిన పరిహారానికి బదులు రుణం తీసుకునేందుకు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. రాష్ట్రాల అంగీకారం మేరకు రెండోవిడత రుణాలను కేంద్రం విడుదల చేసింది. ప్రతిపాదనల్లో ఆప్షన్-1 కింద 21 రాష్ట్రాలు ప్రత్యేక విండోను ఎంచుకున్నాయి. జీఎస్టీ పరిహారం కోసం ఏపీ ప్రత్యేక విండోను ఎంచుకుంది.

జీఎస్టీ పరిహారంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ...కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 'స్పెషల్ బారోయింగ్ విండో' కింద నిధులు విడుదలయ్యాయి. స్పెషల్‌ బారోయింగ్‌ విండో కింద ఇప్పటికే రూ.12 వేల కోట్ల రుణం ఇచ్చిన కేంద్రం...జీఎస్టీ పరిహారం సెస్ కొరత తీర్చేందుకు రాష్ట్రాలకు నిధుల విడుదల చేసింది.

ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి భేటీలో..కేంద్రం ఇవ్వాల్సిన పరిహారానికి బదులు రుణం తీసుకునేందుకు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. రాష్ట్రాల అంగీకారం మేరకు రెండోవిడత రుణాలను కేంద్రం విడుదల చేసింది. ప్రతిపాదనల్లో ఆప్షన్-1 కింద 21 రాష్ట్రాలు ప్రత్యేక విండోను ఎంచుకున్నాయి. జీఎస్టీ పరిహారం కోసం ఏపీ ప్రత్యేక విండోను ఎంచుకుంది.

ఇదీచదవండి

తిరుమలలో సర్వదర్శనం టికెట్ల కోసం తోపులాట.. భక్తులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.