మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి జన్మనిచ్చింది. కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన మహిళకు.. ఒంటికన్నుతో మగశిశువు పుట్టినట్లు వైద్యులు తెలిపారు.
పుట్టిన గంట తర్వాత... శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. జన్యుపరమైన లోపాల కారణంగా... వింత ఆకారంలో శిశువు జన్మించాడని వైద్యులు ధృవీకరించారు.