ETV Bharat / city

'పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'

పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలను అడ్డుకునే హక్కు పొట్లూరి వరప్రసాద్​కు లేదని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. విక్రమ్ కైలాస్ ఇంటికి వెళ్లి నిర్మాణాలను అడ్డుకుని... అతనిని దూషించిన కేసులో పీవీపీతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణను వేగవంతం చేసి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు.

author img

By

Published : Jun 24, 2020, 10:41 PM IST

'పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'
'పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'

వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

''15 నెలల క్రితం పీవీపీ విల్లాస్​లో విక్రమ్ కైలాస్ ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. కొన్ని మార్పుల దృష్ట్యా ఇంటిపై అదనంగా నిర్మాణాలు ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ పీవీపీ 15 మంది వ్యక్తులతో అక్కడకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు కైలాస్ తెలిపారు. అదనంగా చేస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మేము ఘటన స్థలానికి చేరుకునే లోపే కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మాణాలను అడ్డుకునే హక్కు పీవీపీకి లేదు. సర్వాధికారుల సొసైటీకే ఉన్నాయి. దీనిపై మరింత విచారణ జరుపుతాం. అక్రమ చొరబాటుకు, బెదిరింపులకు, ధ్వంసం చేసినందుకు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశాం.''

- ఏసీపీ, శ్రీనివాస్ రావు

'పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'

మరికొంత మందిని విచారించాల్సి ఉందని ఏసీపీ వెల్లడించారు. విచారణ ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్​పై బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

''15 నెలల క్రితం పీవీపీ విల్లాస్​లో విక్రమ్ కైలాస్ ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. కొన్ని మార్పుల దృష్ట్యా ఇంటిపై అదనంగా నిర్మాణాలు ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ పీవీపీ 15 మంది వ్యక్తులతో అక్కడకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు కైలాస్ తెలిపారు. అదనంగా చేస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మేము ఘటన స్థలానికి చేరుకునే లోపే కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మాణాలను అడ్డుకునే హక్కు పీవీపీకి లేదు. సర్వాధికారుల సొసైటీకే ఉన్నాయి. దీనిపై మరింత విచారణ జరుపుతాం. అక్రమ చొరబాటుకు, బెదిరింపులకు, ధ్వంసం చేసినందుకు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశాం.''

- ఏసీపీ, శ్రీనివాస్ రావు

'పీవీపీ విల్లాస్​లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'

మరికొంత మందిని విచారించాల్సి ఉందని ఏసీపీ వెల్లడించారు. విచారణ ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.