ETV Bharat / city

'ఆత్మకథలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది'

author img

By

Published : Mar 27, 2021, 5:16 PM IST

'తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు' అంశంపై విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ.. సిద్ధార్థ కళాపీఠం సంయుక్తంగా ఈ సదస్సు ఏర్పాటు చేసింది. తెలుగు భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ప్రముఖ రచయితలు సదస్సులో పాల్గొన్నారు.

ప్రముఖ రచయితలు
ఆత్మకథలను ప్రోత్సహించాలి
ఆత్మకథలను ప్రోత్సహించాలి

సమాజంలో స్వీయ చరిత్రలు, ఆత్మకథలకు విశిష్ట స్థానం ఉందని ప్రముఖ రచయితలు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు, జీవిత కథల గురించి చర్చించింది చాలా తక్కువ అని.. ఆత్మకథలు దశాబ్దాల కిందటి నాటి సామాజిక స్థితిగతులు, ప్రజల జీవిత విధానాలను తెలియజేస్తాయన్నారు. 50 ఏళ్లు, వందేళ్ల నాటి పరిస్థితులు ఆత్మకథల ద్వారానే తెలుసుకోగలమని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ వంటివాటి ద్వారా ప్రజల్లో ఆత్మకథల పట్ల ఉత్సుకత పెరిగిందని.. ఆత్మకథలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు సాహిత్యంలో ఉందని వక్తలు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

ఆత్మకథలను ప్రోత్సహించాలి

సమాజంలో స్వీయ చరిత్రలు, ఆత్మకథలకు విశిష్ట స్థానం ఉందని ప్రముఖ రచయితలు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు, జీవిత కథల గురించి చర్చించింది చాలా తక్కువ అని.. ఆత్మకథలు దశాబ్దాల కిందటి నాటి సామాజిక స్థితిగతులు, ప్రజల జీవిత విధానాలను తెలియజేస్తాయన్నారు. 50 ఏళ్లు, వందేళ్ల నాటి పరిస్థితులు ఆత్మకథల ద్వారానే తెలుసుకోగలమని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ వంటివాటి ద్వారా ప్రజల్లో ఆత్మకథల పట్ల ఉత్సుకత పెరిగిందని.. ఆత్మకథలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు సాహిత్యంలో ఉందని వక్తలు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.