ఉద్యోగుల హెల్త్కార్డ్ అమలుకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమస్యలు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా అధికారి డా. సుబ్రమణ్యం అన్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం నేతలతో విజయవాడలో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. హైదరాబాద్లో ఏపీ ఉద్యోగులకు హెల్త్ కార్డుపై వైద్య సేవలు అందించే నెట్వర్క్ ఆసుపత్రులకు అదనంగా.. మరో 14 ఆసుపత్రుల్లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.. ఉద్యోగులకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: ఫిర్యాదుచేస్తే ఓట్ల లెక్కింపు చిత్రీకరణ తప్పనిసరి: హైకోర్టు