ETV Bharat / city

PRC: జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.. ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక

author img

By

Published : Feb 23, 2022, 2:14 PM IST

AP High Court on PRC: పీఆర్సీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగస్తులకు నష్టం చేకూరేలా జీవోలున్నాయని పిటిషనర్​ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం
జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం

AP High Court on PRC: పీఆర్సీ వ్యవహారంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగస్తులకు నష్టం చేకూరేలా జీవోలున్నాయని పిటిషనర్​ తరపు న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీతం నుంచి రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతుందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం..పీఆర్సీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్​కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్​తో పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జీతం నుంచి రికవరీ చేసినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

AP High Court on PRC: పీఆర్సీ వ్యవహారంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఛైర్మన్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగస్తులకు నష్టం చేకూరేలా జీవోలున్నాయని పిటిషనర్​ తరపు న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీతం నుంచి రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతుందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం..పీఆర్సీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్​కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్​తో పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జీతం నుంచి రికవరీ చేసినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి

ఒక పోస్టు కోసం భర్తీ చేసుకుని... మరో పోస్టులో ఎలా నియమిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.