ETV Bharat / city

అక్టోబరు తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాలపై చర్చకు అక్టోబరు తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భేటీకి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయం సమాచారం పంపింది.

author img

By

Published : Sep 28, 2020, 7:21 PM IST

అపెక్స్ కౌన్సిల్ సమావేశం
అపెక్స్ కౌన్సిల్ సమావేశం

అక్టోబరు తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాలపై చర్చకు కౌన్సిల్ ఏర్పాటు చేసిన కేంద్రం... ఇరు రాష్ట్రాల లేవనెత్తే అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు తదితర అంశాలపై కీలక చర్చ జరగనుంది. పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం ప్రాజెక్టులపై తెలుగురాష్ట్రాల నుంచి కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు అందాయి. కౌన్సిల్ భేటీ జరిగే వరకు పోతిరెడ్డిపాడు నిర్మాణం ఆపాలని ఇప్పటికే కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

కౌన్సిల్‌లో సభ్యులుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ వ్యవహరించనుండగా..భేటీకి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయం సమాచారం పంపింది.

అక్టోబరు తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాలపై చర్చకు కౌన్సిల్ ఏర్పాటు చేసిన కేంద్రం... ఇరు రాష్ట్రాల లేవనెత్తే అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు తదితర అంశాలపై కీలక చర్చ జరగనుంది. పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం ప్రాజెక్టులపై తెలుగురాష్ట్రాల నుంచి కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు అందాయి. కౌన్సిల్ భేటీ జరిగే వరకు పోతిరెడ్డిపాడు నిర్మాణం ఆపాలని ఇప్పటికే కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

కౌన్సిల్‌లో సభ్యులుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ వ్యవహరించనుండగా..భేటీకి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయం సమాచారం పంపింది.

ఇదీచదవండి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.