అంతర్జాతీయ విపణిలో 318 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 విడతల్లో ఎర్ర చందనం వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి ధరలను ఖరారు చేసేందుకు గానూ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ వేలంలో ఎర్ర చందనం దుంగల్ని విక్రయించేందుకు ధర నిర్ణయించాల్సిందిగా కమిటీకి సూచనలు జారీ అయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి నేతృత్వంలో అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, ఏపీ అటవీ అభివృద్ధిశాఖ వీసీఎండీలతో కమిటీ ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి
మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. పరిశీలనలో పలువురి పేర్లు!