ETV Bharat / city

భక్తులకు వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలి: తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి

author img

By

Published : Mar 16, 2021, 10:08 PM IST

తితిదే పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్​లో ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి అకస్మికంగా తనిఖీలు చేశారు. భక్తులకు వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ttd call center
తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశించారు. భక్తులకు సమాచారం అందించే లక్ష్యంతో తితిదే పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్​ను అధికారుల‌తో క‌లిసి ఆయన త‌నిఖీ చేశారు. భక్తుల నుంచి కాల్ సెంటర్‌కు వచ్చే సూచనలు, ఫిర్యాదులను రికార్డు చేస్తున్న విధానం, కాల్ సెంట‌ర్ ప‌నితీరును పరిశీలించారు.

ttd call cతితిదే కాల్ సెంటర్​లో తనిఖీలు చేస్తున్న ఈవోenter
తితిదే కాల్ సెంట‌ర్ ప‌నితీరును పరిశీలిస్తున్న ఈవో

భ‌క్తుల సౌకర్యార్థం తితిదే చేపడుతున్న కార్యక్రమాల సమాచారం, భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందిస్తున్న తీరును ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి.. ఈవోకు వివ‌రించారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశించారు. భక్తులకు సమాచారం అందించే లక్ష్యంతో తితిదే పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్​ను అధికారుల‌తో క‌లిసి ఆయన త‌నిఖీ చేశారు. భక్తుల నుంచి కాల్ సెంటర్‌కు వచ్చే సూచనలు, ఫిర్యాదులను రికార్డు చేస్తున్న విధానం, కాల్ సెంట‌ర్ ప‌నితీరును పరిశీలించారు.

ttd call cతితిదే కాల్ సెంటర్​లో తనిఖీలు చేస్తున్న ఈవోenter
తితిదే కాల్ సెంట‌ర్ ప‌నితీరును పరిశీలిస్తున్న ఈవో

భ‌క్తుల సౌకర్యార్థం తితిదే చేపడుతున్న కార్యక్రమాల సమాచారం, భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందిస్తున్న తీరును ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి.. ఈవోకు వివ‌రించారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.