కర్ణాటక ముఖ్యమంత్రి యడీయూరప్ప చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీవారికి మెుక్కులు తీర్చుకోవడానికి తిరుమల చేరుకున్నారు.ఆయనకు భాజపా జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డిప్యూటీ ఈవో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం తిరుమల బాలాజీని ఆయన దర్శించుకోనున్నారు.
ఇదీచదవండి