ETV Bharat / city

కరోనా కాలంలోనూ.. ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌! - కరోనా కాలంలోనూ స్విమ్స్ ప్రత్యేకత వార్తలు

కరోనా వేళ ఇతర రోగాలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందడం కష్టతరంగా మారింది. అన్ని చోట్లా కొవిడ్‌నే ప్రథమ ప్రధాన్యంగా తీసుకోవడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. ఇతర రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పనిభారంతో కరోనా మినహా మిగిలిన వైద్యసేవలను ఆసుపత్రులు రద్దు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలోనూ తితిదే ఆధ్వర్యంలోని స్విమ్స్‌ ఆసుపత్రి మాత్రం.. తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏడాదిన్నరగా డయాలసిస్‌ సేవలను నిరాటంకంగా కొనసాగిస్తూ.. రోగుల పాలిట ఆరోగ్యప్రదాతగా నిలుస్తోంది.

కరోనా కాలంలోనూ ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌
కరోనా కాలంలోనూ ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌
author img

By

Published : May 31, 2021, 9:45 AM IST

కరోనా కాలంలోనూ ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ- స్విమ్స్‌.. స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఒకటిగా కరోనా సేవలను విస్తృతస్థాయిలో అందిస్తోంది. స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల మొత్తం కొవిడ్‌ ఆసుపత్రి కాగా.. అందులో 145ఐసీయూ, 328 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటిలో 40 వెంటిలేటర్ల ద్వారా చిత్తూరు జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి పెద్దఎత్తున రోగులు వచ్చి కరోనాకు చికిత్స పొందుతున్నారు.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో.. రుయాతో పాటు స్విమ్స్‌పై విపరీతమైన భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పది ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిని రద్దు చేసి కరోనా రోగుల కోసం సేవలందిస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే.. స్విమ్స్‌ ఆసుపత్రిలో మాత్రం డయాలసిస్‌ సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ చికిత్స తప్పనిసరి. వారంలో కనీసం మూడు రోజులు రక్తంలోని మలినాలను శుద్ధి చేసుకోవాలి. కరోనా విపత్కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న డయాలసిస్‌ కేంద్రాలు చాలా వరకూ సేవలను అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయినప్పటికీ స్విమ్స్‌ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక విభాగాల ద్వారా రోగులు డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉన్న 125 డయాలసిస్‌ యూనిట్ల ద్వారా రోజుకు 300మంది చొప్పున.. రోజు విడిచి రోజు మొత్తం 600మంది రోగులకు ఇక్కడి వైద్యులు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు.

గతేడాది కరోనా సమయంలోనూ నిరాటంకంగా పనిచేస్తూ.. 91 వేల 169 డయాలసిస్‌ పరీక్షలను స్విమ్స్‌ ఆసుపత్రుల వైద్యులు నిర్వహించగా... అందులో 500మందికి పైగా కరోనాతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 16వేల 313 డయాలసిస్‌ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికీ వైద్యం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

పేటీఎం రూ.22,000 కోట్ల ఐపీఓ!

కరోనా కాలంలోనూ ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ- స్విమ్స్‌.. స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఒకటిగా కరోనా సేవలను విస్తృతస్థాయిలో అందిస్తోంది. స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల మొత్తం కొవిడ్‌ ఆసుపత్రి కాగా.. అందులో 145ఐసీయూ, 328 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటిలో 40 వెంటిలేటర్ల ద్వారా చిత్తూరు జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి పెద్దఎత్తున రోగులు వచ్చి కరోనాకు చికిత్స పొందుతున్నారు.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో.. రుయాతో పాటు స్విమ్స్‌పై విపరీతమైన భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పది ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిని రద్దు చేసి కరోనా రోగుల కోసం సేవలందిస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే.. స్విమ్స్‌ ఆసుపత్రిలో మాత్రం డయాలసిస్‌ సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ చికిత్స తప్పనిసరి. వారంలో కనీసం మూడు రోజులు రక్తంలోని మలినాలను శుద్ధి చేసుకోవాలి. కరోనా విపత్కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న డయాలసిస్‌ కేంద్రాలు చాలా వరకూ సేవలను అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయినప్పటికీ స్విమ్స్‌ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక విభాగాల ద్వారా రోగులు డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉన్న 125 డయాలసిస్‌ యూనిట్ల ద్వారా రోజుకు 300మంది చొప్పున.. రోజు విడిచి రోజు మొత్తం 600మంది రోగులకు ఇక్కడి వైద్యులు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు.

గతేడాది కరోనా సమయంలోనూ నిరాటంకంగా పనిచేస్తూ.. 91 వేల 169 డయాలసిస్‌ పరీక్షలను స్విమ్స్‌ ఆసుపత్రుల వైద్యులు నిర్వహించగా... అందులో 500మందికి పైగా కరోనాతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 16వేల 313 డయాలసిస్‌ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికీ వైద్యం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

పేటీఎం రూ.22,000 కోట్ల ఐపీఓ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.