ETV Bharat / city

శ్రీరామనవమికి శ్రీ వారి ఆలయంలో ఆస్థానం నిర్వహణ: తితిదే

author img

By

Published : Apr 19, 2021, 3:47 PM IST

ఈ నెల 21 న వస్తున్న శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తునట్లు తితిదే ప్రకటించింది. 22న శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

sriramanavami
శ్రీరామనవమికి శ్రీ వారి ఆలయంలో ఆస్థానం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ నిర్వహించి.. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను తితిదే ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వ‌హించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇవీ చదవండి:

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ నిర్వహించి.. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను తితిదే ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వ‌హించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇవీ చదవండి:

వైకుంఠనాథుని సేవలో రాజకీయ ప్రముఖులు

దిల్లీలో లాక్​డౌన్- లిక్కర్​ షాపుల ముందు భారీ క్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.