ETV Bharat / city

ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి కోవింద్ - తిరుపతి రానున్న రాష్ట్రపతి కోవింద్ తాజా వార్తలు

ఈ నెల 24న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తిరుపతి రానున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు శ్రీవారిని దర్శించుకొని తిరిగి అదేరోజు అహ్మదాబాద్​కు బయలుదేరి వెళతారని చిత్తూరు కలెక్టర్ తెలిపారు.

ఈ నెల 24న తిరుపతి రానున్న రాష్ట్రపతి కోవింద్
ఈ నెల 24న తిరుపతి రానున్న రాష్ట్రపతి కోవింద్
author img

By

Published : Nov 19, 2020, 6:32 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుపతి రానున్నారు. 24 ఉదయం 9.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయల్దేరి 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని చిత్తూరు కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకకోనున్నారు.

అనంతరం 12.15 నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. మద్యాహ్నం 12.50 గంటలకు వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్​కు బయలుదేరి వెళతారని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుపతి రానున్నారు. 24 ఉదయం 9.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయల్దేరి 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని చిత్తూరు కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకకోనున్నారు.

అనంతరం 12.15 నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. మద్యాహ్నం 12.50 గంటలకు వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్​కు బయలుదేరి వెళతారని కలెక్టర్ తెలిపారు.

ఇదీచదవండి

సీఎం జగన్ స్థానిక ఎన్నికలు జరగనివ్వరు: జేసీ దివాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.