ETV Bharat / city

చిన్నారి మృతి... ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి..! - చిత్తూరులో బాలక మృతిపై ఆసుపత్రిపై కుటుంబసభ్యులు దాడి

తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై దాడి జరిగింది. అధిక మోతాదులో మందులు ఇచ్చినందున తమ పాప మరణించిందని... మృతురాలి తల్లిదండ్రుల, బంధువులు ఆందోళన చేశారు.

చిన్నారి మృతి పట్ల ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి
చిన్నారి మృతి పట్ల ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి
author img

By

Published : Dec 5, 2019, 6:46 PM IST

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందంటూ... తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. నగరానికి చెందిన రమేష్ రెడ్డి, కవిత... జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తెను మూడు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెంగీ జ్వరం ఉందని వైద్యులు తెలపగా... ఆసుపత్రిలో చేర్చారు. జ్వరం ఎక్కువై బాలికకు ఫిట్స్ వచ్చింది. మరో ఆసుపత్రికి తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు.

పాప తల్లిదండ్రులు అంబులెన్స్​లో చెన్నైకి తీసుకెళ్లారు. చెన్నైలోని వైద్యులు పాపను పరీక్షించి... డెంగీ లేదని తెలిపారు. అధిక మోతాదులో మందులు ఇవ్వడం కారణంగా పాప మరణించిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు తిరుపతిలోని ఆసుపత్రిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాపను కోల్పోయామని ఆరోపించారు. తన తప్పిదం జరిగి ఉంటే... ఎటువంటి శిక్షకైన అర్హుడనని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారి మృతి పట్ల ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి

ఇదీ చదవండి :

వైద్యసేవల్లో లోపం... గర్భిణులకు శాపం..!

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందంటూ... తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. నగరానికి చెందిన రమేష్ రెడ్డి, కవిత... జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తెను మూడు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెంగీ జ్వరం ఉందని వైద్యులు తెలపగా... ఆసుపత్రిలో చేర్చారు. జ్వరం ఎక్కువై బాలికకు ఫిట్స్ వచ్చింది. మరో ఆసుపత్రికి తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు.

పాప తల్లిదండ్రులు అంబులెన్స్​లో చెన్నైకి తీసుకెళ్లారు. చెన్నైలోని వైద్యులు పాపను పరీక్షించి... డెంగీ లేదని తెలిపారు. అధిక మోతాదులో మందులు ఇవ్వడం కారణంగా పాప మరణించిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు తిరుపతిలోని ఆసుపత్రిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాపను కోల్పోయామని ఆరోపించారు. తన తప్పిదం జరిగి ఉంటే... ఎటువంటి శిక్షకైన అర్హుడనని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారి మృతి పట్ల ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి

ఇదీ చదవండి :

వైద్యసేవల్లో లోపం... గర్భిణులకు శాపం..!

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.