ETV Bharat / city

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలి: బాబా రామ్​దేవ్ - baba ramdev latest news

దేశీయ ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలని సూచించారు. ఆవుల రక్షణకు పతంజలి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రామ్ దేవ్ బాబా
రామ్ దేవ్ బాబా
author img

By

Published : Oct 31, 2021, 8:52 PM IST

తిరుపతిలో గో మహాసమ్మేళనం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కంచి కామకోటి పీఠాధిపతి, యోగా గురువు రామ్​దేవ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్​దేవ్ బాబా.. దేశీయ ఆవుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దేశీయ ఆవుల రక్షణకు పతంజలి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశీయ గోవుల పునరుత్పత్తి, సంరక్షణకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమని ప్రకటించారు.

ఆయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని అనుకున్నామా..? అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం ఖాయమని పేర్కొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సాధువులంతా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలన్న ఆయన.. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు స్వామీజీలందరూ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

తిరుపతిలో గో మహాసమ్మేళనం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కంచి కామకోటి పీఠాధిపతి, యోగా గురువు రామ్​దేవ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్​దేవ్ బాబా.. దేశీయ ఆవుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దేశీయ ఆవుల రక్షణకు పతంజలి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశీయ గోవుల పునరుత్పత్తి, సంరక్షణకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమని ప్రకటించారు.

ఆయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని అనుకున్నామా..? అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం ఖాయమని పేర్కొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సాధువులంతా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలన్న ఆయన.. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు స్వామీజీలందరూ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ఎవరి భిక్షా కాదు.. వైకాపా ఎంపీలు కాఫీ తాగడానికి వెళ్తున్నారా? వారంలోగా అఖిల పక్షాన్ని పిలవండి : పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.