ETV Bharat / city

Cyber Crime Offender Arrest : ఇన్సూరెన్స్ పాలసీలకు పైసలిస్తామని ఫోన్లు.. తీరా నగదు చెల్లించాక.. - చిత్తూరులో సైబర్ నేరగాళ్లు

Cyber Crime Offender Arrest : ఆపేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు నగదు చెల్లిస్తామని ఫోన్ల మీద ఫోన్లు చేశారు. డబ్బు ఖాతాకు చేరాలంటే కొంత మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తీరా డబ్బులు చెల్లించాకగానీ.. అసలు విషయం అర్థం కాలేదు. ఈ ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.

సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు
author img

By

Published : Dec 16, 2021, 6:18 PM IST

Cyber Crime Offender Arrest : చిత్తూరు పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో సందీప్ కిషోర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి.. అనివార్య కారణాలతో వాటిని మధ్యలోనే అపేశాడు. ఈ విషయాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి, తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. నిలిపివేసిన పాలసీల గురించి ఆరా తీశారు. ఫోన్ చేసింది ఆర్బీఐ వారేనని నమ్మిన సందీప్ వారికి వివరాలు తెలిపాడు.

ఆ సైబర్ కేటుగాళ్లు నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తాము 35 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇందుకోసం జీఎస్టీ కింద నగదు చెల్లించాలని సందీప్ ని కోరారు. వారి మాయమాటలు నమ్మిన సందీప్ కిషోర్ పలుమార్లు రూ. 20 లక్షల రూపాయలు చెల్లించాడు. ఎంతకీ తనకు రావల్సిన మొత్తం ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారించిన చిత్తూరు టూ టౌన్ పోలీసులు నోయిడాకు చెందిన శైలేంద్ర సింగ్ ను అరెస్టు చేశారు. ఇంకా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దని మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Fake CBI Agents in Police Custody: పోలీసులకు చిక్కిన నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠా.. అదుపులో నలుగురు

Cyber Crime Offender Arrest : చిత్తూరు పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో సందీప్ కిషోర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి.. అనివార్య కారణాలతో వాటిని మధ్యలోనే అపేశాడు. ఈ విషయాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి, తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. నిలిపివేసిన పాలసీల గురించి ఆరా తీశారు. ఫోన్ చేసింది ఆర్బీఐ వారేనని నమ్మిన సందీప్ వారికి వివరాలు తెలిపాడు.

ఆ సైబర్ కేటుగాళ్లు నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తాము 35 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇందుకోసం జీఎస్టీ కింద నగదు చెల్లించాలని సందీప్ ని కోరారు. వారి మాయమాటలు నమ్మిన సందీప్ కిషోర్ పలుమార్లు రూ. 20 లక్షల రూపాయలు చెల్లించాడు. ఎంతకీ తనకు రావల్సిన మొత్తం ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారించిన చిత్తూరు టూ టౌన్ పోలీసులు నోయిడాకు చెందిన శైలేంద్ర సింగ్ ను అరెస్టు చేశారు. ఇంకా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దని మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Fake CBI Agents in Police Custody: పోలీసులకు చిక్కిన నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠా.. అదుపులో నలుగురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.