ETV Bharat / city

CAR ACCIDENT : కారు బీభత్సం... అదుపుతప్పి ప్రజలపైకి

author img

By

Published : Nov 5, 2021, 5:24 PM IST

Updated : Nov 5, 2021, 7:32 PM IST

తిరుపతిలో(tirupathi) ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు.. ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి(four people injured). 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

కారు బీభత్సం
కారు బీభత్సం
కారు బీభత్సం

కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి అక్కారంపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

ఇదీచదవండి: junior NTR: ఎన్టీఆర్​కు సర్జరీ.. అసలేం జరిగిందంటే..!

కారు బీభత్సం

కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి అక్కారంపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

ఇదీచదవండి: junior NTR: ఎన్టీఆర్​కు సర్జరీ.. అసలేం జరిగిందంటే..!

Last Updated : Nov 5, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.