ETV Bharat / city

భార్యాభర్తలను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​పై​... ప్రశంసల వెల్లువ!

author img

By

Published : May 6, 2021, 4:37 PM IST

రైలు ప్రయాణంలో నిద్రపోయిన భార్యాభర్తలు.. తిరుపతి స్టేషన్​లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి జారిపడ్డారు. వెంటనే గుర్తించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్.. వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ ఘటన మీడియాలో వైరల్​ కాగా.. తిరుమల స్టేషన్​ డైరెక్టర్ సత్యనారాయణ అతడిని సత్కరించారు. విధినిర్వహణలో అంకితభావనతో పనిచేసినందుకు కొనియాడారు.

rpf constable rescued a pair in tirupati
ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ సతీష్​కు సత్కారం
భార్యాభర్తలను కాపాడిన కానిస్టేబుల్​

తిరుపతిలో రైలు నుంచి పొరపాటున జారి పడిపోయిన మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తి, అంకితభావంతో వారి ప్రాణాలు కాపాడిన సతీష్​ను మెచ్చుకుంటూ.. తిరుపతి రైల్వే అధికారులు ఘనంగా సన్మానించారు. స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది.. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. విధుల పట్ల అంకిత భావంతో గస్తీ తిరుగుతూ ఉండటం వల్లే.. సతీష్ ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగారని స్టేషన్ డైరెక్టర్ ప్రశంసించారు.

ఇదీ చదవండి: హోం ఐసొలేషన్​లో ఉన్న వారికీ ఆక్సిజన్​ పంపిణీ

తిరుమల ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్న​ ఓ కుటుంబం తిరుపతిలో దిగాల్సి ఉండగా.. నిద్రమత్తులో స్టేషన్ వచ్చిందని గమనించలేదు. ఆ స్టేషన్​ నుంచి బయలుదేరి వెళ్తుండగా... రైలు నుంచి భార్యాభర్తలు కిందకి దిగే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో జారిపడిన మహిళతో పాటు ఆమె భర్తను.. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఉదయం నాలుగున్నర గంటలకు ఘటన జరగ్గా.. స్టేషన్​లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.

ఇదీ చదవండి:

ధూళిపాళ్ల కస్టడీ గడువు పొడిగించేది లేదు: అ.ని.శా. కోర్టు

భార్యాభర్తలను కాపాడిన కానిస్టేబుల్​

తిరుపతిలో రైలు నుంచి పొరపాటున జారి పడిపోయిన మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తి, అంకితభావంతో వారి ప్రాణాలు కాపాడిన సతీష్​ను మెచ్చుకుంటూ.. తిరుపతి రైల్వే అధికారులు ఘనంగా సన్మానించారు. స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది.. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. విధుల పట్ల అంకిత భావంతో గస్తీ తిరుగుతూ ఉండటం వల్లే.. సతీష్ ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగారని స్టేషన్ డైరెక్టర్ ప్రశంసించారు.

ఇదీ చదవండి: హోం ఐసొలేషన్​లో ఉన్న వారికీ ఆక్సిజన్​ పంపిణీ

తిరుమల ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్న​ ఓ కుటుంబం తిరుపతిలో దిగాల్సి ఉండగా.. నిద్రమత్తులో స్టేషన్ వచ్చిందని గమనించలేదు. ఆ స్టేషన్​ నుంచి బయలుదేరి వెళ్తుండగా... రైలు నుంచి భార్యాభర్తలు కిందకి దిగే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో జారిపడిన మహిళతో పాటు ఆమె భర్తను.. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఉదయం నాలుగున్నర గంటలకు ఘటన జరగ్గా.. స్టేషన్​లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.

ఇదీ చదవండి:

ధూళిపాళ్ల కస్టడీ గడువు పొడిగించేది లేదు: అ.ని.శా. కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.