తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు స్వర్ణ నందకాన్ని విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన శ్రీవారి భక్తుడు ఎం.ఎస్.ప్రసాద్.. కోటి 8 లక్షల రూపాయలతో ఆరున్నర కిలోల బంగారంతో స్వర్ణఖడ్గాన్ని తయారు చేయించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయాని చేరుకున్న ఎం.ఎస్.ప్రసాద్ దంపతులు స్వామివారికి స్వర్ణాభరణం బహుకరించారు. దాతలను తితిదే ఆధికారులు అభినందించారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి.. తీర్థప్రసాదాలను అందజేశారు.
"శ్రీవారికి అన్నమయ్య ద్వారా శ్రీ మహవిష్ణువు నందకాన్ని అందించిన తరహాలో ఓ స్వర్ణ నందకం తయారుచేయాలని సంకల్పించాం. అందులో భాగంగా ప్రస్తుతం స్వామికి ఉన్న 'సూర్యకఠారి' (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించాం. ఇందుకోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించాం."- ఎం.ఎస్. ప్రసాద్, శ్రీవారి భక్తుడు
ఇదీ చదవండి:
Chalo Thadepalli: 'అవరోధాలు ఎదురైనా.. ఆంక్షలు విధించినా.. ముందుకే'