AP HRC CHAIMAN: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపిన కేసులో..వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మృతుడి తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని కోరారు. రాజమహేంద్రవరంలో హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తిని బాధిత కుటుంబ సభ్యులతోపాటు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కలిసి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్యకేసులో కాకినాడ పోలీస్ అధికారులు చట్టబద్ధ విధులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, విచారణ నిర్లక్ష్యానికి కారణమయ్యారని ఫిర్యాదు చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడి, ముద్దాయిలకు సహకరించేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. 58 పేజీల కేసు వివరాలు, కాకినాడ జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడిన సీడీతోపాటు 7 పేజీల ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్కు సమర్పించారు.
ఇవీ చదవండి: