ETV Bharat / city

'సకాలంలో రుణాలు చెల్లిస్తే.. 33 పైసలే వడ్డీ'

author img

By

Published : May 5, 2020, 6:52 PM IST

నెల్లూరులో డీసీసీబీ చైర్మన్​... బ్యాంకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

nellore dccb chairman meeting with bank employees in nellore
ఉన్నతాధికారులతో సమావేశమనైన నెల్లరు డీసీసీబీ బ్యాంకు చైర్మన్​

నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి... బ్యాంకుల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా కేంద్ర సహకార బ్యాంకు రూ.100 కోట్ల రూపాయలు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.

సకాలంలో రుణం చెల్లిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా చూస్తామని చెప్పారు. 2 లక్షల రూపాయలకు 33 పైసల వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం దారులకు రైతులకు రెండు లక్షల రుణానికి 7 శాతం వడ్డీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

సకాలంలో చెల్లిస్తే 33 పైసలు మాత్రమే కట్టవలసి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి... బ్యాంకుల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా కేంద్ర సహకార బ్యాంకు రూ.100 కోట్ల రూపాయలు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.

సకాలంలో రుణం చెల్లిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా చూస్తామని చెప్పారు. 2 లక్షల రూపాయలకు 33 పైసల వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం దారులకు రైతులకు రెండు లక్షల రుణానికి 7 శాతం వడ్డీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

సకాలంలో చెల్లిస్తే 33 పైసలు మాత్రమే కట్టవలసి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

'ఆక్వా రంగ సమస్యలను పరిష్కరిస్తాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.