ETV Bharat / city

కరోనా కాలం.. నలిగిపోతున్న నాలుగో సింహం

author img

By

Published : Mar 30, 2020, 6:23 PM IST

ఖాకీలు అంటే కఠిన హృదయాలు.. కనికరించరు అనే అపవాదు. కాఠిన్యం తప్ప క్షమాగుణం కనిపించదనేది నిన్నటి మాట. కరోనా విస్తృతి నేపథ్యంలో శాంతిభద్రతల నుంచి సమాజ రక్షకులుగా మారిపోయారు. వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రచారం చేయడంతోపాటు ప్రజలెవరూ వీధుల్లోకి రాకుండా నిలువరించడంతోపాటు, నిత్యావసర సరకులు, మందులు.. ఇలా అన్నింటినీ వారే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజానీకం తీసుకునే కనీస జాగ్రత్తలు కూడా విస్మరించి విధులు నిర్వహిస్తున్నారు.

kurnool district
నలిగిపోతున్న నాలుగో సింహం

కరోనా వైరస్‌ పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ ముమ్మరంగా సాగుతోంది. దీనిని విజయవంతం చేయడానికి కర్త, కర్మ, క్రియ అంతా పోలీసుల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. కరోనా వైరస్‌ అందరికీ ఒకటే అయినా.. తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు, ఆహార పానీయాలు లేకుండా మండే ఎండలో పని చేసుకుంటూ పోలీసులు నలిగిపోతున్నారు . అంటువాంటివే నంద్యాల పట్టణంలో కనిపించిన కొన్ని దృశ్యాలు మీకోసం.

దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు

దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు
దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు

అసలే ఎండాకాలం.. ఎండలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉంటున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విధుల్లో మునిగిపోతున్నారు. సరైన ఆహారం లేక, నీళ్లు తీసుకోకుండా, నిద్రకు, కుటుంబాలకు దూరంగా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్‌ నుంచి డీఐజీ స్థాయి అధికారి వరకు అందరిదీ ఇదే పరిస్థితి.

వారం రోజులుగా రోడ్లపైనే..

ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు పోలీసులు తమ విధుల్లో భాగంగా నిర్వహించే సాధారణ విధులకంటే అసాధారణ విధులను నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రోడ్ల పైకి వస్తున్న పోలీసులు, హోంగార్డులు రాత్రి 9 గంటల తర్వాతే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉదయం అల్పాహారం నుంచి ఆహారం, నీళ్లు అన్నీ రోడ్ల మీదే తీసుకుంటున్నారు. సాధారణంగా పోలీసులకు ఉండే అలర్జీ, గ్యాస్‌ట్రబుల్‌, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న పోలీసు శాఖ ఉన్నంతలోనే సమర్థంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తూ ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పక తప్పదు.

కనీస జాగ్రత్తలు కరవై...

కరోనా నేపథ్యంలో సామాన్యుడు సైతం ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని బయటకు వస్తున్న దశలో.. పోలీసులకు ముఖానికి, చేతులకు కనీస తొడుగులు కూడా సరఫరా లేదు. దీంతో చేతిరుమాల్లనే ముఖానికి అడ్డు పెట్టుకుని విధులు చాలా మంది నిర్వహిస్తున్నారు. చేతులను శుభ్రం చేసుకునేందుకువాడే శానిటైజర్లను కూడా రెండు రోజుల క్రితమే వారికి అందించారు. మండే ఎండల్లో ఉంటున్న ప్రత్యేకంగా నీళ్లు ఇచ్చేవారు కూడా కరవయ్యారు. దాతలు అనాథలు, నిరాశ్రయులకు ఇచ్చే ఆహారం, నీళ్లనే వీరికి అందిస్తున్నారు. కొన్నిచోట్ల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మధ్యాహ్నం వేళ నీడకు పోదామంటే కూడా చిన్నపాటి దాపు లేకుండా పోయింది.

సెలవుల్లేవు..

పని ఒత్తిడి ఎక్కువైనా.. రోజువారి విధులకు భిన్నంగా పని చేస్తున్న పోలీసులకు ప్రస్తుత పరిస్థితుల్లో సెలవులను రద్దు చేశారు. సాధారణ విధుల్లో భాగంగా 24 గంటలు పని చేస్తే 36 గంటలు సెలవు ఉండేది. ప్రస్తుతం అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నా.. సెలవులు, ఇతరత్రా సదుపాయాలు మాత్రం ఏమీ లేవు.

కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 22 పోలీస్‌ సర్కిళ్ల పరిధిల్లోనూ 84 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పోలీసుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. విరామం ఎరుగని పోలీసు శాఖ ఇప్పటికే నిబంధనలు అతిక్రమించిన వారిపై శుక్రవారం ఒక్క రోజే 164 మందిపై కేసులు చేసి రూ.7 లక్షల జరిమానా విధించింది.

క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టడంతోపాటు కరోనా ట్రాకింగ్‌ యాప్‌ను ఏర్పాటు చేశారు. రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రవాసుల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా సరిహద్దుల చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి వివరాలను తెలుసుకుని అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రైల్వే పోలీసుల ఔదార్యం

రైల్వే పోలీసుల ఔదార్యం
రైల్వే పోలీసుల ఔదార్యం

లాక్‌డౌన్‌ సందర్భంగా పేదలకు ఆహారాన్ని సమకూర్చేందుకు నంద్యాల రైల్వే సీఐ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ముందుకొచ్చారు. గత రెండు రోజులుగా రైల్వే పోలీసులు స్వయంగా ఆహారాన్ని వండించి పేదలకు, యాచకులకు అన్నదానం చేస్తున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో సుమారు 200 మందికి భోజనవసతి కల్పించారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న కానిస్టేబుల్‌ రామప్ఫ ఉదయం నుంచి విధుల్లో ఉన్నారు. మిట్టమధ్యాహ్నం అవుతున్న ఇంకా దాతలు ఎవరూ ఆహారం అందివ్వడానికి రాలేదు. ఒక వైపు ఆకలి వేస్తున్న విధులను మాత్రం విస్మరించకుండా దాతలు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు.

వారం రోజులుగా రోడ్లపైనే..
వారం రోజులుగా రోడ్లపైనే..

నంద్యాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఎదురుగా మూడు రోడ్ల కూడలిలో విధులు నిర్వహిస్తున్న ఈ పోలీసులకు ఎటువంటి మాస్కులు లేకపోవడంతో చేతిరుమాలను అడ్డు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. కాసింతసేపు కూర్చుందామనుకునేలోపే పట్టణంలోకి వాహనాలు వస్తుండటంతో వారికి నచ్చజెప్పి పంపడం, మితిమీరితే కేసులు నమోదు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ ముమ్మరంగా సాగుతోంది. దీనిని విజయవంతం చేయడానికి కర్త, కర్మ, క్రియ అంతా పోలీసుల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. కరోనా వైరస్‌ అందరికీ ఒకటే అయినా.. తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు, ఆహార పానీయాలు లేకుండా మండే ఎండలో పని చేసుకుంటూ పోలీసులు నలిగిపోతున్నారు . అంటువాంటివే నంద్యాల పట్టణంలో కనిపించిన కొన్ని దృశ్యాలు మీకోసం.

దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు

దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు
దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు

అసలే ఎండాకాలం.. ఎండలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉంటున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విధుల్లో మునిగిపోతున్నారు. సరైన ఆహారం లేక, నీళ్లు తీసుకోకుండా, నిద్రకు, కుటుంబాలకు దూరంగా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్‌ నుంచి డీఐజీ స్థాయి అధికారి వరకు అందరిదీ ఇదే పరిస్థితి.

వారం రోజులుగా రోడ్లపైనే..

ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు పోలీసులు తమ విధుల్లో భాగంగా నిర్వహించే సాధారణ విధులకంటే అసాధారణ విధులను నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రోడ్ల పైకి వస్తున్న పోలీసులు, హోంగార్డులు రాత్రి 9 గంటల తర్వాతే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉదయం అల్పాహారం నుంచి ఆహారం, నీళ్లు అన్నీ రోడ్ల మీదే తీసుకుంటున్నారు. సాధారణంగా పోలీసులకు ఉండే అలర్జీ, గ్యాస్‌ట్రబుల్‌, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న పోలీసు శాఖ ఉన్నంతలోనే సమర్థంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తూ ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పక తప్పదు.

కనీస జాగ్రత్తలు కరవై...

కరోనా నేపథ్యంలో సామాన్యుడు సైతం ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని బయటకు వస్తున్న దశలో.. పోలీసులకు ముఖానికి, చేతులకు కనీస తొడుగులు కూడా సరఫరా లేదు. దీంతో చేతిరుమాల్లనే ముఖానికి అడ్డు పెట్టుకుని విధులు చాలా మంది నిర్వహిస్తున్నారు. చేతులను శుభ్రం చేసుకునేందుకువాడే శానిటైజర్లను కూడా రెండు రోజుల క్రితమే వారికి అందించారు. మండే ఎండల్లో ఉంటున్న ప్రత్యేకంగా నీళ్లు ఇచ్చేవారు కూడా కరవయ్యారు. దాతలు అనాథలు, నిరాశ్రయులకు ఇచ్చే ఆహారం, నీళ్లనే వీరికి అందిస్తున్నారు. కొన్నిచోట్ల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మధ్యాహ్నం వేళ నీడకు పోదామంటే కూడా చిన్నపాటి దాపు లేకుండా పోయింది.

సెలవుల్లేవు..

పని ఒత్తిడి ఎక్కువైనా.. రోజువారి విధులకు భిన్నంగా పని చేస్తున్న పోలీసులకు ప్రస్తుత పరిస్థితుల్లో సెలవులను రద్దు చేశారు. సాధారణ విధుల్లో భాగంగా 24 గంటలు పని చేస్తే 36 గంటలు సెలవు ఉండేది. ప్రస్తుతం అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నా.. సెలవులు, ఇతరత్రా సదుపాయాలు మాత్రం ఏమీ లేవు.

కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 22 పోలీస్‌ సర్కిళ్ల పరిధిల్లోనూ 84 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పోలీసుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. విరామం ఎరుగని పోలీసు శాఖ ఇప్పటికే నిబంధనలు అతిక్రమించిన వారిపై శుక్రవారం ఒక్క రోజే 164 మందిపై కేసులు చేసి రూ.7 లక్షల జరిమానా విధించింది.

క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టడంతోపాటు కరోనా ట్రాకింగ్‌ యాప్‌ను ఏర్పాటు చేశారు. రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రవాసుల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా సరిహద్దుల చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి వివరాలను తెలుసుకుని అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రైల్వే పోలీసుల ఔదార్యం

రైల్వే పోలీసుల ఔదార్యం
రైల్వే పోలీసుల ఔదార్యం

లాక్‌డౌన్‌ సందర్భంగా పేదలకు ఆహారాన్ని సమకూర్చేందుకు నంద్యాల రైల్వే సీఐ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ముందుకొచ్చారు. గత రెండు రోజులుగా రైల్వే పోలీసులు స్వయంగా ఆహారాన్ని వండించి పేదలకు, యాచకులకు అన్నదానం చేస్తున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో సుమారు 200 మందికి భోజనవసతి కల్పించారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న కానిస్టేబుల్‌ రామప్ఫ ఉదయం నుంచి విధుల్లో ఉన్నారు. మిట్టమధ్యాహ్నం అవుతున్న ఇంకా దాతలు ఎవరూ ఆహారం అందివ్వడానికి రాలేదు. ఒక వైపు ఆకలి వేస్తున్న విధులను మాత్రం విస్మరించకుండా దాతలు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు.

వారం రోజులుగా రోడ్లపైనే..
వారం రోజులుగా రోడ్లపైనే..

నంద్యాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఎదురుగా మూడు రోడ్ల కూడలిలో విధులు నిర్వహిస్తున్న ఈ పోలీసులకు ఎటువంటి మాస్కులు లేకపోవడంతో చేతిరుమాలను అడ్డు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. కాసింతసేపు కూర్చుందామనుకునేలోపే పట్టణంలోకి వాహనాలు వస్తుండటంతో వారికి నచ్చజెప్పి పంపడం, మితిమీరితే కేసులు నమోదు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.