ETV Bharat / city

rudraksha shiva lingam: లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం.. ఎక్కడంటే?

author img

By

Published : Mar 1, 2022, 9:33 PM IST

shivaratri: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుత సన్నివేశం కడప జిల్లా రాజంపేటలో జరిగింది.

rudraksha shiva lingam
లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం

shivaratri festival: రాజంపేట పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని ఏర్పాటు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని ఓం శాంతి శిక్షకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ రుద్రాక్షలను నేపాల్​ నుంచి తెప్పించినట్లు ఆమె పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్​నాథరెడ్డి, పురపాలక చైర్మెన్ పోలా శ్రీనివాసరెడ్డిలతో పాటు పలువురు మహా శివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి రుద్రాక్ష శివలింగాన్ని కనులారా వీక్షించి తరించారు. మూడు రోజులపాటు భక్తుల కోసం రుద్రాక్షలతో తయారుచేసిన ఈ మహా శివలింగాన్ని ప్రదర్శనకు పెట్టనున్నట్లు నిర్వాహకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంశాంతి ప్రతినిధులు డాక్టర్ శివకేశవులు, చలపతి, కుబేరుడు, రాజేశ్వరి, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం

ఇదీ చదవండి: శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం... ఉచిత దర్శనానికి ఆరు గంటలు

shivaratri festival: రాజంపేట పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని ఏర్పాటు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని ఓం శాంతి శిక్షకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ రుద్రాక్షలను నేపాల్​ నుంచి తెప్పించినట్లు ఆమె పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్​నాథరెడ్డి, పురపాలక చైర్మెన్ పోలా శ్రీనివాసరెడ్డిలతో పాటు పలువురు మహా శివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి రుద్రాక్ష శివలింగాన్ని కనులారా వీక్షించి తరించారు. మూడు రోజులపాటు భక్తుల కోసం రుద్రాక్షలతో తయారుచేసిన ఈ మహా శివలింగాన్ని ప్రదర్శనకు పెట్టనున్నట్లు నిర్వాహకురాలు బి.కే.సావిత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంశాంతి ప్రతినిధులు డాక్టర్ శివకేశవులు, చలపతి, కుబేరుడు, రాజేశ్వరి, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో మహా శివలింగం

ఇదీ చదవండి: శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం... ఉచిత దర్శనానికి ఆరు గంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.