ETV Bharat / city

కడప కేంద్ర కారాగారం నుంచి జేసీ ప్రభాకర్​రెడ్డి విడుదల

అట్రాసిటీ కేసులో కడప జైలుకు వెళ్లిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జైసీ ప్రభాకర్​ రెడ్డి గురువారం బెయిల్​పై విడుదలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారం ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది. వాటి పత్రాలు తీసుకుని ఆయన అనుచరులు సాయంత్రం కడప కేంద్ర కారాగారంలో జైలు అధికారులకు అందజేశారు. అక్కడ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్​కు చికిత్సకు వెళ్లినట్టు ఆయున కుటుంబ సభ్యులు తెలిపారు.

author img

By

Published : Aug 20, 2020, 7:38 PM IST

jc prabhakar reddy released from kadapa central jail on bail
బెయిల్​పై విడుదలైన జేసీ ప్రభాకర్​ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి గురువారం కడప జైలు నుంచి బెయిల్​పై విడుదలయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడం వల్ల పీపీఈ కిట్​ ధరించి బయటకి వచ్చారు. ఆయన డ్రైవర్​ కూడా జాగ్రత్తలు పాటించి పీపీఈ కిట్​ ధరించాడు. అక్కడ నుంచి హైదరాబాద్​కు నేరుగా వెళ్లిపోయారు. కరోనా చికిత్సకు హైదరాబాద్​ ఆసుపత్రికి వెళ్తున్నట్టు జేసీ ప్రభాకర్​ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం కడప జైలులో 317 మంది ఖైదీలకు, జైలు సిబ్బందికి కరోనా కేసులు నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లిన జేసీకు ఈ మహమ్మారి సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది.

ఇదీ చదవండి :

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి గురువారం కడప జైలు నుంచి బెయిల్​పై విడుదలయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడం వల్ల పీపీఈ కిట్​ ధరించి బయటకి వచ్చారు. ఆయన డ్రైవర్​ కూడా జాగ్రత్తలు పాటించి పీపీఈ కిట్​ ధరించాడు. అక్కడ నుంచి హైదరాబాద్​కు నేరుగా వెళ్లిపోయారు. కరోనా చికిత్సకు హైదరాబాద్​ ఆసుపత్రికి వెళ్తున్నట్టు జేసీ ప్రభాకర్​ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం కడప జైలులో 317 మంది ఖైదీలకు, జైలు సిబ్బందికి కరోనా కేసులు నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లిన జేసీకు ఈ మహమ్మారి సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది.

ఇదీ చదవండి :

జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.